బిగ్‌బాస్‌ : వారి రాకతో గొడవలన్ని మటుమాయం

తెలుగు బిగ్‌బాస్‌ గత మూడు సీజన్‌లలో కుటుంబ సభ్యులను ఇంట్లోకి పంపించిన సమయంలో ఎమోషన్‌ బాగా పండింది .

ఆ ఎపిసోడ్‌లకు రేటింగ్‌ బాగా వచ్చింది.ఈసారి కరోనా కారణంగా అలాంటి ప్రయోగం చేయవద్దని భావించారు.

కాని వీక్‌ ఎపిసోడ్‌లకు రేటింగ్‌ దారుణంగా ఉంటున్న నేపథ్యంలో ఆ ఎమోషన్‌ పండిస్తేనే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది.

అందుకోసం జాగ్రత్తలు తీసుకుని బిగ్‌బాస్‌ టీం కంటెస్టెంట్స్‌ కుటుంబ సభ్యులను పంపించారు.గ్లాస్‌ క్యాబిన్‌ ఏర్పాటు చేసిన టీం కరోనా ప్రొటక్షన్‌ తో కంటెస్టెంట్స్‌ కు వారి కుటుంబ సభ్యులను పంపించడం జరిగింది.

మొదట అఖిల్‌ తల్లి వచ్చారు.ఆమె ను చూసి అఖిల్‌ కన్నీరు పెట్టుకున్నాడు.

అందరితో సరదాగా మాట్లాడిన ఆమె అభిజిత్‌ నీకు అన్నయ్య లాస్య నీకు అక్క అంటూ చెప్పింది.

ఆమె మాటలతో అభిజిత్‌ మరియు అఖిల్‌ ల మద్య గొడవ పూర్తిగా తొలగి పోయింది.

"""/"/ అఖిల్‌ అమ్మ వెళ్లిపోయిన తర్వాత హారిక తల్లి వచ్చారు.ఆమె కూడా కూతురుతో పాటు ఇతర ఇంటి సభ్యులతో సరదాగా మాట్లాడారు.

ఈసారి అయినా కెప్టెన్‌ అవ్వు అంది.హారికను చూసుకుంటున్నందుకు అభిజిత్‌కు కృతజ్ఞతలు తెలియజేసింది.

అందరు బాగా ఆడుతున్నారు అంటూ చెప్పింది.ఆ తర్వాత అభిజిత్‌ తల్లి వచ్చారు.

ఆమె రావడంతోనే ఎమోషనల్‌ అయ్యారు.అభిజిత్‌ ఆమెను ఎమోషనల్‌ వద్దు అంటూ నవ్వించే ప్రయత్నం చేశాడు.

మీకు ఒక మంచి అవకాశం దక్కింది.ఇలాంటి చోట మీకు మళ్లీ ఎప్పుడు కూడా ఛాన్స్‌ రాదు.

అందుకే ఎంజాయ్‌ చేయండి.కొట్టుకోండి అంటూ అందరిని నవ్వించింది.

మీరు ప్రతి ఒక్కరు కూడా బాగా ఆడుతున్నారు అంది.చివర్లో అవినాష్‌ తల్లి కూడా వచ్చారు.

ఆమె కూడా అందరితో ముచ్చటించారు.అవినాష్‌ కు ముద్దు పెట్టి ఊరికే పెళ్లి అనకు త్వరలోనే పెళ్లి చేస్తాం అంది.

అమ్మలు రావడంతో అందరి మద్య ఉన్న గొడవలు కనిపించకుండా పోయాయి.బద్ద శత్రువుల మాదిరిగా వ్యవహరిస్తున్న అఖిల్‌ మరియు అభిజిత్‌లు కలిసి పోయారు.

సోహెల్‌కు హారిక సారీ చెప్పింది.ఇక నేటి ఎపిసోడ్‌ లో ఎవరు రాబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది.

అలాంటి సన్నివేశాలు నా వల్ల కాదు.. సాయిధన్సిక షాకింగ్ కామెంట్స్ వైరల్!