బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షోపై సంచలన వ్యాఖ్యలు చేసిన తెలుగు యాంకర్….

టాలీవుడ్ లో ఒకప్పుడు తన గలగల మాటలతో అందరినీ నవ్విస్తూ ఎంతగానో ప్రేక్షకులను అలరించినటువంటి సీనియర్ యాంకర్ ఝాన్సీ గురించి తెలుగు సినీ పరిశ్రమలో పెద్దగా తెలియని వారుండరు.

అయితే ఝాన్సీ ఒక ఒకపక్కపలు షోలకి, ఈవెంట్లకి యాంకరింగ్ నిర్వహిస్తూనే మరోపక్క సినిమాల్లో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.

అయితే తాజాగా యాంకర్ ఝాన్సీ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొంది.

ఇందులో భాగంగా తెలుగులో మంచి ప్రాధాన్యత సంపాదించుకున్న ?"బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో" పై పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఇందులో ముఖ్యంగా బిగ్ బాస్ గేమ్ షో నిర్వాహకుల స్క్రిప్ట్ ఆధారంగా జరుగుతుందని అలాంటప్పుడు అది రియాల్టీ గేమ్ షో ఎలా అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది.

అంతేగాక మనకి ఇష్టం లేకుండా వెళ్లి మన మనసుని బాధ పెట్టుకోవడం తప్ప మనం చేసేది ఏమీ ఉండదంటూ విమర్శలు చేసింది.

"""/"/ అలాగే తనకిబిగ్ బాస్ మొదటి సీజన్ లోనే అవకాశం వచ్చిందని కానీ తనకి ఇష్టం లేకపోవడంతో వెళ్ళ లేదని కూడా పేర్కొంది.

దీంతో యాంకర్ ఝాన్సీ చేసినటువంటి ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు బాగానే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

మరికొందరైతే యాంకర్ ఝాన్సీ చేసిన వ్యాఖ్యలకు మద్దతిస్తున్నారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా యాంకర్ ఝాన్సీ తన భర్తతో విడిపోయిన అనంతరం ఒంటరిగా ఉంటోంది.

అప్పుడప్పుడు అడపాదడపా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.ఏదేమైనప్పటికీ ఒకప్పుడు స్టార్ యాంకర్ల సరసన కొనసాగినటువంటి యాంకర్ ఝాన్సీ జోరు ఈ మధ్య కాలంలో కొంత మేర తగ్గినట్లు కనిపిస్తోంది.

వేములవాడలో మోదీ.. కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు