ఆ హీరోయిన్ ని బీజేపీ పార్టీ నుంచి గెంటేయాలంటున్న శ్రీ రెడ్డి…. ఇంతకీ ఎవరామే…?

ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్నటువంటి ఆకృత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు మీటూ ఉద్యమానికి తెరలేపి కలకలం సృష్టించిన శ్రీరెడ్డి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అయితే ఈ అమ్మడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను టాలీవుడ్ సినీ పరిశ్రమ బహిష్కరణకు గురైనప్పటి నుంచి చెన్నైకి మకాం మార్చి సోషల్ మీడియా మాధ్యమం అయినటువంటి ఫేస్ బుక్ ద్వారా తరచూ ఏదో ఒక విషయం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది.

అయితే తాజాగా టాలీవుడ్ హీరోయిన్ మరియు బీజేపీ పార్టీ నాయకురాలు మాధవీలత పై పలు అనుచిత వ్యాఖ్యలు చేసింది.

ఇటీవలే శ్రీ రెడ్డిని ఉద్దేశిస్తూ పరోక్షంగా పవన్ కళ్యాణ్ అభిమానులు మాధవీలత ను శ్రీ రెడ్డితో పోల్చుతూ కామెంట్లు చేశారు.

దీంతో మాధవీలత ఈ విషయంపై స్పందిస్తూ తనని అలాంటి వాళ్ళతో మరోసారి పోల్చకండి అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.

ఈ విషయం తెలుసుకున్న శ్రీ రెడ్డి కూడా తనదైన శైలిలో రెచ్చిపోయింది.ఇందులో భాగంగా బీజేపీ పార్టీ నుంచి గెంటెయ్యాలని ఇలాంటి వారి వల్ల పార్టీ మొత్తానికి చెడ్డ పేరు వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేసింది.

 అంతేగాక మరో మారు తనని ప్రత్యక్షంగా గాని లేదా పరోక్షంగా గాని  కదిపితే మాత్రం బాగోదని అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.

అయితే వీరిద్దరి మధ్య ఈ మాటల యుద్ధం ఇప్పటిది కాదు. అప్పట్లో శ్రీ రెడ్డి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అప్పటినుంచి మాధవీలత కూడా శ్రీ రెడ్డి కి మాటకు మాట సమాధానం చెబుతూ వస్తోంది.

 దీంతో ఈ మధ్య వీరిద్దరి మధ్య మాటల పోరు తారా స్థాయికి చేరుకుంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం శ్రీరెడ్డి తన హాట్ హాట్ ఫోటోలని, వీడియోలని తన అధికారిక ఫేస్ బుక్  ఖాతా ద్వారా షేర్ చేస్తూ రోజురోజుకీ తన అభిమానుల సంఖ్య పెంచుకుంటోంది.

కాగా ప్రస్తుతం ఫేస్ బుక్ లో శ్రీ రెడ్డిని దాదాపుగా 5.9 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు శ్రీ రెడ్డికి సోషల్ మీడియా మాధ్యమాల్లో ఉన్నటువంటి ఫాలోయింగ్ గురించి.

పెళ్లిలో మాస్ స్టెప్స్ తో డాన్స్ అదరగొట్టిన నవ వధువు.. వీడియో వైరల్..