వ్యభిచారం కేసులో చిక్కింది వేరే నటి.. కానీ అందరూ ఈ హీరోయిన్ ని దారుణంగా…

ఒక్కోసారి ఒకరు చేసినటువంటి పనులకు ఇంకొకరు బలవుతుంటారు.ఇలా బలైన వారు తమ జీవితాంతం నిందలు మోస్తూనే ఉంటారు.

 దీనికి తోడు కొంతమంది నిజానిజాలు తెలుసుకోకుండా వారి గురించి తప్పుడు ప్రచారాలు చేయడం వల్ల ఈ ప్రభావం ఏకంగా తమ కెరియర్  కూడా పడుతుంటుంది.

తెలుగు బుల్లితెరపై "తూర్పు వెళ్ళే రైలు" అనే ధారావాహిక ద్వారా సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న తెలుగమ్మాయి "శ్రీ దివ్య" గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

 అయితే శ్రీ దివ్య మొదటగా ధారావాహికల ద్వారా సినిమా పరిశ్రమకి పరిచయం అయినప్పటికీ మెల్లమెల్లగా హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకొని ప్రస్తుతం తమిళంలో టాప్ హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే ఈ అమ్మడు గతంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో జరిగినటువంటి ఓ రైడ్ లో వ్యభిచారం నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడినట్లు అప్పట్లో పలు వార్తలు బలంగా వినిపించాయి.

దీంతో ఈ వార్తల ప్రభావం శ్రీ దివ్య  సినిమా కెరియర్ పై బాగానే ప్రభావం చూపింది.

 కానీ వాస్తవం ఏమిటంటే పలు చిత్రాలలో మరియు ధారావాహికలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో నటించిన మరో తెలుగు నటి దివ్య శ్రీ వ్యభిచారంలో పట్టుబడింది.

"""/"/ కానీ దివ్య శ్రీ కి బదులుగా శ్రీ దివ్య వ్యభిచారంలో పట్టుబడిందని కొంతమంది అవగాహన లేకుండా తప్పుడు ప్రచారం చేయడంతో చాలా మంది శ్రీ దివ్య వ్యభిచారం నిర్వహిస్తూ పట్టుబడిందని అనుకున్నారు.

దీంతో శ్రీ దివ్య కొంతకాలం పాటు సినిమా పరిశ్రమకు దూరంగా ఉంది. ఆ తర్వాత మళ్ళీ అసలు నిజం తెలియడంతో దర్శక నిర్మాతలు శ్రీ దివ్యకి అవకాశాలు ఇచ్చారు.

  ఇందుకు తగ్గట్టుగానే శ్రీ దివ్య తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ క్రమంలో తమిళంలో విశాల్, కార్తీ వంటి  స్టార్ హీరల సరసన నటించే అవకాశాలు దక్కించుకుంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా తమిళంలో ప్రముఖ సినీ దర్శకుడు బర్నేష్ దర్శకత్వం వహిస్తున్న "ఒత్తెక్కు ఒథై" అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఈచిత్రంలో గద్దలకొండ మూవీ ఫేమ్ "అథర్వ" హీరోగా నటిస్తుండగా ప్రముఖ సినీ నిర్మాత దినేష్ కార్తీక్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

ఇటీవలే టాలీవుడ్లో ఓ ప్రముఖ స్టార్ హీరో హీరోగా నటిస్తున్న  చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

ఫేక్ వీడియోలతో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం..: అమిత్ షా