కరోనా వల్ల నెల రోజులపాటూ ఆసుపత్రిలో ఉన్నా... చివరికి...

తెలుగులో ఒకప్పుడు అనుమానాస్పదం, మోహిని, తదితర చిత్రాలతో సినీ ప్రేక్షకులను బాగానే అలరించిన టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ "హంసా నందిని" గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అయితే నటి హంసా నందిని సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో హీరోయిన్ గా కెరియర్ ప్రారంభించినప్పటికీ అనుకోకుండా అవకాశాలను కోల్పోయింది.

 దీంతో గ్లామర్ షో చేయడానికి కూడా సిద్ధ పడింది.ఈ క్రమంలో ఆ మధ్య టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు "కొరటాల శివ" దర్శకత్వం వహించిన "మిర్చి" చిత్రంలో స్పెషల్ సాంగ్ లో నటించి  కుర్రకారుని తన అందాల ఆరబోతతో ఉర్రూతలూగించింది.

దీంతో అప్పటి నుంచి ఈ అమ్మడికి స్పెషల్ సాంగ్స్ లో నటించే అవకాశాలు క్యూ కట్టాయి.

కాగా ఈ మధ్య  హంసానందిని సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది.

అయితే తాజాగా హంసా నందిని కరోనా వైరస్ నుంచి కోలుకోవడంతో బాగా ఎంజాయ్ చేస్తోంది.

అంతేకాకుండా కరోనా వైరస్ కారణంగా దాదాపుగా నెల రోజులపాటూ ఆసుపత్రిలో గడపడంతో తన ఆలోచనా ధోరణి పూర్తిగా మారిపోయిందని, ఏదేమైనప్పటికీ తన అభిమానుల ప్రార్థనలు మరియు ఆశీస్సులతోనే తాను కరోనా వైరస్ నుంచి తొందరగా కొలుకున్నట్లు తెలిపింది.

అంతేకాకుండా రాబోయేటువంటి థర్డ్ వేవ్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి పూర్తిగా సన్నద్ధమవ్వాలని సూచించింది.

అయితే ఇటీవలే హంసా నందిని తన అధికారిక ఇన్స్తాగ్రామ్ ద్వారా షేర్ చేసినటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

అయితే ఇందులో హంసా నందిని బికిని దుస్తులు ధరించి బీచ్ లో హల్ చల్ చేస్తుండగా తీసినట్లు తెలుస్తోంది.

అలాగే సాంప్రదాయ దుస్తులు ధరించి స్లీవ్ లెస్ జాకెట్ తో ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.

దీంతో ఒక్కసారిగా ఈ అమ్మడి అందాల ఆరబోత కి నెటిజన్లు ఫిదా అయ్యారు.

"""/"/ అయితే ఈ మధ్య కాలంలో హంసా నందిని టాలీవుడ్ చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించడంతో పాటూ స్పెషల్ సాంగ్స్ లో కూడా నటిస్తూ ప్రేక్షకులని బాగానే అలరిస్తోంది.

ఏదేమైనప్పటికీ ఈ అమ్మడు హీరోయిన్ గా కంటే తన సెకండ్ ఇన్నింగ్స్ లోనే బాగా సక్సెస్ అయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

అద్భుతమైన ఈ మొక్క.. ఎక్కడ కనిపించినా వదలకండి..!