ఉదయ్ కిరణ్ లవ్ స్టోరీ గురించి చిరంజీవికి ముందే తెలుసు ... కానీ....

తెలుగులో ఒకప్పుడు లవ్ మరియు ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటు పలు నేషనల్ అవార్డులను కూడా దక్కించుకున్న తెలుగు స్వర్గీయ నటుడు "ఉదయ్ కిరణ్" గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.

అయితే అతి చిన్న వయసులో సినిమా ఇండస్ట్రీకి వచ్చి హీరోగా నిలదొక్కుకుని స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ అనుకోకుండా పలు ఆర్థిక సమస్యలు మరియు వృత్తి పరమైన సమస్యలు కారణంగా ఆత్మహత్య చేసుకొని తన అభిమానులను శోక సంద్రంలో ముంచేశాడు.

కాగా తాజాగా ఉదయ్ కిరణ్ సోదరి "శ్రీ దేవి" ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని ఉదయ్ కిరణ్ గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.

అయితే ఇందులో భాగంగా ఉదయ్ కిరణ్ నటించిన మనసంతా నువ్వే చిత్రం హిట్ అయిన తర్వాత ఓ యువతితో ప్రేమలో పడ్డాడని కానీ ఏమైందో ఏమోగానీ కొంతకాలానికే వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో లవ్ బ్రేకప్ అయ్యిందని తెలిసింది.

దీంతో ఉదయ్ కిరణ్ ఎమోషనల్ గా బాగా అప్సెట్ అయ్యాడని చెప్పుకొచ్చింది.అయితే అప్పట్లో ఉదయ్ కిరణ్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో చాలా చనువుగా ఉండేవాడిని ఈ క్రమంలో ఉదయ్ కిరణ్ తన లవ్ బ్రేకప్ గురించి కూడా చిరంజీవితో పంచుకున్నాడని దాంతో చిరంజీవి ఆ సమయంలో ఉదయ్ కిరణ్ ని ఓదార్చి చాలా ప్రోత్సహించాడని తెలిపింది.

అంతేకాకుండా జీవితంలో అప్పుడప్పుడు కొన్ని బంధాలు పలకరించి వెళ్ళిపోతుంటాయని కాబట్టి వాటి గురించి బాధ పడకుండా ఇకపై సినీ కెరీర్ పై దృష్టి సారించమని ధైర్యం కూడా చెప్పాడని తెలిపింది.

అయితే ఉదయ్ కిరణ్ లవ్ బ్రేకప్ అయిన కొంతకాలానికి చిరంజీవి తన కూతురు మ్యారేజ్ ప్రపోజల్ చేశాడని అలాగే చిరంజీవి మరియు కుటుంబ సభ్యులు చాలా మంచివాళ్ళని కూడా తెలిపింది.

తాను మరియు తన కుటుంబ సభ్యులు ఎప్పుడు చిరంజీవి ఇంటికి వెళ్ళిన చాలా ఆప్యాయంగా పలకరించే వాళ్ళని చెప్పుకొచ్చింది.

కానీ నిశ్చితార్థం అయిన తర్వాత ఉదయ్ కిరణ్ మరియు సుష్మితల అభిరుచులు కలవకపోవడం, అలాగే ఇతర కారణాల వల్ల పెళ్లి ఆగి పోయిందని అంతేతప్ప తమ ఇరువురి కుటుంబాల మధ్య ఎలాంటి మనస్పర్థలు, విబేధాలు లేవని క్లారిటీ ఇచ్చింది.

అలాగే చిరంజీవి కుటంబ సభ్యులతో తనకు ఇప్పటికీ సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది.

"""/"/ ఉదయ్ కిరణ్ కి ఎలాంటి ఆర్థిక పరమైన సమస్యలు లేవని కేవలం తన కెరియార్ గురించి మాత్రమే ఎప్పుడూ దిగులుగా ఉండేవాడని చెప్పుకొచ్చింది.

అంతేకాకుండా తన తల్లి కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు మరియు దాదాపుగా 4 కేజీల బంగారం ఉదయ్ కిరణ్ కి అప్పజెప్పినట్లు కూడా తెలిపింది.

తన తల్లి మరణానంతరం ఉదయ్ కిరణ్ కి అన్ని తానై పెంచానని కానీ ఉన్నట్లుండి ఇంత పెద్ద నిర్ణయం తీసుకుని లోకాన్ని విడిచి పెట్టి వెళ్లిపోతాడని ఎప్పుడూ అనుకోలేదని కొంతమేర ఎమోషనల్ అయ్యింది.

వైరల్ పోస్ట్: పెళ్ళికి ముందే అసలు విషయం కనిపెట్టిస్తున్నట్టున్నాడు ఈ తమ్ముడు.. కావాలంటే పోస్ట్ చూడండి..