తెలంగాణ ఆచరిస్తుంది -దేశం అనుసరిస్తుంది… మంత్రి హరీశ్ రావు కామెంట్స్

2022-23 లో రూ.72,564 కోట్ల పన్నులు వసూలు చేసి వాణిజ్య పన్నుల శాఖ చరిత్ర సృష్టించిందని మంత్రి హరీశ్ రావు అన్నారు.

వాణిజ్య శాఖ మేథో మధన సదస్సులో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

కేంద్రం నుంచి సెస్ తీసుకోని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.తెలంగాణ జీరో సెస్ టేకింగ్ స్టేట్ ఇన్ ఇండియా అని వ్యాఖ్యానించారు.

తెలంగాణ ఆచరిస్తుందన్న మంత్రి హరీశ్ రావు దేశం అనుసరిస్తుందని పేర్కొన్నారు.తెలంగాణ సంక్షేమ పథకాలను కేంద్రం అనుసరిస్తుందని వెల్లడించారు.

వ్యవసాయ వృద్ధిరేటులో దక్షిణ భారత్ లోనే తెలంగాణ నంబర్ వన్ అని తెలిపారు.

అన్ స్టాపబుల్ షోలో మరోమారు సందడి చేయనున్న ఏపీ సీఎం.. ఫోటోలు వైరల్!