ఎన్ని(కల ) సిత్రాలో : ఉదయం ఓ పార్టీ .. సాయంత్రం ఓ పార్టీ !
TeluguStop.com
ఎన్నికలు వచ్చాయంటే చాలు.చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటూ ఉంటాయి.
ఎక్కడ లేని బంధుత్వాలు.ఆప్యాయతలు గుర్తుకు వచ్చేస్తుంటాయి.
అంతే కాదు.ఒక మోస్తరు బలమైన నాయకులు ఉన్నారు అంటే చాలు వారిని ఎలాగైనా లాక్కొచ్చి మరీ.
తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు.ఇవన్నీ ఎన్నికల సమయంలో కామన్.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఇక తెలంగాణ విషయంలోకి వస్తే.ఆత్మకూరులో .
పింగళి రాజిరెడ్డి అనే వ్యక్తి ఉదయం ఒక పార్టీలో చేరగా.సాయంత్రం మరో పార్టీలో చేరి అందరిని ఆశ్చర్య పరిచాడు.
పూర్తి వివరాలు పరిశీలిస్తే.ఆత్మకూరు బీజేపీ మండల అధ్యక్షుడు పింగిళి రాజిరెడ్డి సోమవారం ఉదయం టీఆర్ఎస్ కండువా పుచ్చుకొని ఆ పార్టీ పరకాల అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి సమక్షంలో చేరారు.
ఇది గమనించిన బీజేపీ నేతలు రాజిరెడ్డితో మంతనాలు చేయడంతో తిరిగి పరకాల అభ్యర్థి డాక్టర్ పెసరు విజయ్చందర్రెడ్డి సమక్షంలో ఆపార్టీలో చేరిపోయారు.
ఇలా ఒకే రోజు రెండు పార్టీల్లో చేరి వార్తల్లో వ్యక్తి అయ్యాడు.
‘గాజు గ్లాస్ ‘ నష్టం తీవ్రంగానే ఉండబోతోందే ? టీడీపీలో వణుకు