తెలంగాణ ఏమైనా కేటీఆర్ జాగీరా..?: కిషన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన ఆయన విభజన హామీలపై కేటీఆర్ కు సమాధానం చెప్పే అవసరం తమకు లేదని తెలిపారు.

కేటీఆర్ షాడో సీఎం అన్న కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏమైనా కేటీఆర్ జాగీరా అని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ అజెండాలో తాము పడబోమని చెప్పారు.ఎమ్మెల్సీలపై గవర్నర్ నిర్ణయం సరైనదేనని తెలిపారు.

అనర్హులకు పదవులు కట్టబెట్టడం సిగ్గుచేటన్నారు.అదేవిధంగా పసుపు బోర్డు ఏర్పాటుపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ ను కానీ, కేసీఆర్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్న కిషన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో బీజేపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

బావ కళ్ళల్లో ఆనందం కాదు.. భక్తుల కళ్ళల్లో ఆనందం చూడు: రోజా