విడుదలైన తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు

హైదరాబాద్ :ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.గత కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఫలితాలను ఎట్టకేలకు మంగళవారం విడుదల చేశారు.

తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డ్ కార్యాలయంలో 11 గంటలకు ఫలితాలను విడుదల చేశారు.

ఒకేసారి ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ పరీక్షా ఫలితాలను మంత్రి సబితా విడుదల చేశారు.

ఇంటర్‌ ఫలితాలు టీవీ9 వెబ్‌సైట్‌లో చాలా సింపుల్‌గా తెలుసుకోవచ్చు.ఈ ఏడాది ఫస్ట్‌ ఇయర్‌లో మొత్తం 63.

85 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, సెకండ్‌ ఇయర్‌లో 67.26 శాతం మంది పాస్‌ అయ్యారు.

ఇక ఈ ఏడాది కూడా ఇంటర్‌ ఫలితాల్లో బాలికలే పైచేయిగా నిలిచారు.ఇదిలా ఉంటే ఈ ఏడాది తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలను మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే.

ఫస్ట్‌ ఇయర్‌ ఎగ్జామ్స్‌కు 4,82,501 మంది, రెండో సంవత్సరం పరీక్షలకు 4,23, 901 మంది హాజరయ్యారు.

మొత్తం 9.06 లక్షల మంది విద్యార్థులు ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షలకు హాజరయ్యారు.

ఓజీ సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్న మరో బాలీవుడ్ స్టార్ హీరో…