తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రచారాన్ని హోరెత్తిస్తుంది.ఇందులో భాగంగా ఆర్మూర్ లో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
పదేళ్లుగా తెలంగాణను బీఆర్ఎస్ నాశనం చేసిందని అమిత్ షా ఆరోపించారు.ఇచ్చిన ఏ హామీని కేసీఆర్ నెరవేర్చలేదని మండిపడ్డారు.
బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత నిజామాబాద్ జిల్లాలో బీడీ కార్మికులకు ప్రత్యేక ఆస్పత్రిని నిర్మిస్తామని తెలిపారు.
పసుపు బోర్డు ఏర్పాటు ద్వారా రైతులకు మంచి ధర వస్తుందన్న అమిత్ షా పసుపు పరిశోధన కూడా చేపడతామని పేర్కొన్నారు.
గల్ఫ్ వెళ్లేవారికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామన్నారు.అలాగే బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించారు.
NRI మహిళ ఓవరాక్షన్.. జాతి వివక్షతో రెచ్చిపోతే ఊరుకుంటారా? పోలీసులేం చేశారో చూడండి..!