తెలంగాణ కరోనా అప్డేట్స్.. !
TeluguStop.com
దేశ వ్యాప్తంగా కరోనా మళ్లీ వింజృంభిస్తుంది అన్న విషయం తెలిసిందే.ఈ దశలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కోవిడ్ కేసులు నమోదు అవుతుండటం ఆందోళన రేకెత్తిస్తుంది.
ఇకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వైరస్ వ్యాపిస్తున్న నేపధ్యంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.
వాటి వివరాలు చూస్తే.తెలంగాణలో మళ్లీ కొత్తగా 216 కరోనా కేసులు నమోదయ్యాయట.
కాగా గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.అదే సమయంలో 168 మంది కోవిడ్ నుండి కోలుకున్నారు.
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,00,933 కు చేరుకోగా, ఇప్పటి వరకు మొత్తం 2,97,363 మంది కోలుకున్నారు.
మృతుల సంఖ్య 1,652 గా ఉంది.తెలంగాణలో ప్రస్తుతం 1,918 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.
వారిలో 749 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే 21, మంగళవారం2024