వీళ్లు మారరా: రసాభాసగా మారిన కాంగ్రెస్ సమావేశం

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ మరికొద్దిరోజుల్లో వెలువడనున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి.

ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ గెలుపు మాదే అంటూ సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తూ ఇప్పటికే అనేక సర్వేలు చేయించుకున్నారు కేసీఆర్.

ఇది ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో మాత్రం ఇప్పటికీ ఆ దిశగా మాత్రం అడుగులు వేయలేకపోతోంది.

తాజాగా మున్సిపల్ ఎన్నికల నిమిత్తం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది.

భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల సమీక్ష సమావేశం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేతృత్వంలో ఈ రోజు నిర్వహించగా జనగామా, యాదాద్రి జిల్లాల నాయకుల మధ్య అంతర్గత విబేధాలు బయటపడ్డాయి.

ఇరు వర్గాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, పార్టీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ముందే ఘర్షణకు దిగారు.

దీంతో అక్కడికి వచ్చిన వారంతా చెల్లచెదురయ్యారు.

స్మార్ట్ ఫోన్ త్వరగా వేడెక్కుతుందా..ఛార్జింగ్ వేగం తగ్గుతుందా.. ఈ టిప్స్ తో సమస్యలకు చెక్..!