తెలంగాణ కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదల

తెలంగాణ కాంగ్రెస్ మ్యానిఫెస్టోను విడుదల చేసింది.ఈ మేరకు మ్యానిఫెస్టోను ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే విడుదల చేశారు.

హైదరాబాద్ లోని గాంధీభవన్ వేదికగా అభయహస్తం పేరుతో తెలంగాణ కాంగ్రెస్ మ్యానిఫెస్టోను విడుదల చేసింది.

కాగా మొత్తం 42 పేజీలతో మ్యానిఫెస్టోను రూపొందించింది.ఇప్పటికే ఆరు గ్యారెంటీ పథకాలను కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఆరు గ్యారెంటీలకు అనుబంధంగా 42 పేజీలతో కూడిన మ్యానిఫెస్టోను ప్రకటించింది.

తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ పాలన ఉంటుందని చెబుతోంది.ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తామన్న కాంగ్రెస్ తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమ అమరవీరులకు రూ.

25 వేల నెలవారీ గౌరవ పెన్షన్ ఇస్తామని తెలిపింది.అమరవీరుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.

తేళ్ల వ్యవసాయంతో లక్షలు సంపాదించవచ్చా… ఈ స్టోరీ తెలిస్తే..