నేడు ఢిల్లీ వెళ్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఢిల్లీకి పయనం కానున్నారు.సీఎం కేసీఆర్ తో పాటు ఆయన సతీమణి కూడా ఢిల్లీ వెళ్లనున్నారు.

ఈనెల 14వ తారీకు ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్ లో.BRS కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.

దానికి ముందు భార్య శోభతో కలిసి రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు.ఆల్రెడీ పార్టీ కేంద్ర కార్యాలయం భవనానికి సంబంధించి వాస్తు గురించి వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్ తేజ్ తో చర్చించడం జరిగింది.

ఈ పరిణామంతో దాదాపు కొన్ని రోజులపాటు కేసీఆర్ ఢిల్లీలోనే ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే పార్టీ కేంద్ర కార్యాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి BRS నేతలు కూడా ఢిల్లీ బాట పట్టారు.

 టిఆర్ఎస్ పార్టీని BRS జాతీయ పార్టీగా ఇటీవల కేసీఆర్ ఆవిష్కరించడం తెలిసిందే.జాతీయ రాజకీయాల్లో కూడా కీలకంగా మారటానికి ఈ రీతిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది.

దీనిలో భాగంగా BRS పార్టీ తరఫున మొదటిసారి కర్ణాటక రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలలో పోటీ చేసే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

తరుణ్ రీ ఎంట్రీ పై రోజా రమణి షాకింగ్ కామెంట్స్… అలాంటి పని చేస్తున్నారంటూ?