మారనున్న తెలంగాణ అసెంబ్లీ రూపురేఖలు..!!

తెలంగాణ అసెంబ్లీ రూపురేఖలు మారనున్నాయి.ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

పార్లమెంట్ ను తలపించే విధంగా కొత్త నిర్మాణాలను చేపట్టాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

ఈ క్రమంలోనే ఇవాళ శాసనసభ, మండలి ప్రాంగణాన్ని పరిశీలించారు.ఆయన వెంట శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు అసెంబ్లీ అధికారులు ఉన్నారు.

పార్లమెంట్ తరహాలోనే అసెంబ్లీ, మండలి కలిపి ఒకే బిట్ లా కనిపించే విధంగా మార్పులు చేయాలన్నారు.

ఇందుకు తగినట్లుగా అసెంబ్లీలో మార్పులు జరగాలని అధికారులను ఆదేశించారు.ఈ మేరకు వచ్చే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే సమయానికి నిర్మాణాలు పూర్తి కావాలని సూచించారు.

వీడియో: చికెన్ సరిగా వండలేదని బిల్డింగ్ పైనుంచి భార్యని తోసేశాడు.. ఎక్కడంటే..??