‘చిత్రం’ సీక్వెల్ సినిమానా? వెబ్ సిరీసా?
TeluguStop.com
దర్శకుడు తేజ దర్శకత్వంలో దాదాపు 20 ఏళ్ల క్రితం వచ్చిన ‘చిత్రం’ సినిమా గుర్తు ఉంది కదా.
ఒక ట్రెండ్ సెట్ చేసిన ఆ సినిమాను దర్శకుడు తేజ కేవలం 30 లక్షల రూపాయలతో పూర్తిగా రామోజీ ఫిల్మ్ సిటీలో ఏమాత్రం భారీతనంకు పోకుండా తెరకెక్కించాడు.
ఈ చిత్రం తేజకు మొదటి సినిమా అవ్వడంతో పాటు ఉదయ్ కిరణ్కు కూడా మొదటి సినిమా.
కోట్ల వసూళ్లు సాధించిన ఆ సినిమాకు ఇన్నాళ్ల తర్వాత సీక్వెల్ను తీయాలని దర్శకుడు తేజ భావిస్తున్నాడు.
చిత్రం సినిమాలో కాస్త బోల్డ్ కంటెంట్ ఉంటుంది.అది మాత్రమే కాకుండా కాస్త యూత్ సెంట్రిక్ గా కూడా సినిమా ఉంటుంది.
ఇప్పుడు దానికి సీక్వెల్ అంటే మరింత బోల్డ్ కంటెంట్ను పెట్టాల్సి ఉంటుంది.మరి బోల్డ్ కంటెంట్ అంటే ఈమద్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఓటీటీ.
వెబ్ సిరీస్ల్లో అయితేనే ఎంత కావాలంటే అంతగా బోల్డ్ కంటెంట్ను జొప్పించ వచ్చు.
"""/"/
దర్శకుడు తేజ చిత్రంకు సీక్వెల్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా సినిమా గా కాకుండా ఓటీటీ కోసం వెబ్ సిరీస్ను చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
మరి తేజ నిర్ణయం ఏంటీ అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.ఈ సీక్వెల్ కోసం ఉదయ్ కిరణ్ వంటి 20 ఏళ్ల కుర్రాడిని ప్రస్తుతం తేజ వెదుకుతున్నాడట.
త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మీ వెయిట్ లాస్ జర్నీలో ఈ మ్యాజికల్ డ్రింక్ ను యాడ్ చేసుకుంటే మరింత వేగంగా బరువు తగ్గొచ్చు.. తెలుసా?