ఏపీ ఎన్నికల విధుల్లోకి టీచర్లు..!!

ఏపీ ఎన్నికలు( AP Elections ) సమీపిస్తున్న తరుణంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

ఇప్పటికే ఓటర్ల జాబితాపై ఫోకస్ చేసిన ఈసీ తాజాగా టీచర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకోనున్నారు.

ఈ మేరకు టీచర్లను( Teachers ) ఎన్నికల విధుల్లోకి తీసుకునే ప్రక్రియను ఎన్నికల సంఘం ప్రారంభించింది.

ఎన్నికల విధులకు సచివాలయ సిబ్బంది సరిపోతారని నిన్న సీఈసీ భేటీలో ప్రస్తావన వచ్చిన సంగతి తెలిసిందే.

"""/" / ఈ నేపథ్యంలోనే సీఈసీ ఆదేశాలతో డీఈవోలకు ఏపీ సీఈవో( AP CEO ) ఆదేశాలు జారీ చేసింది.

రేపటిలోగా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ క్రమంలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లుగా ఈసీ టీచర్లను నియమించనుంది.

స్కిల్ సెన్సెస్ :  సచివాలయ ఉద్యోగులకు మరో బాధ్యత