మైనర్ విద్యార్థినిపై ఏడాదిగా ఉపాధ్యాయుల అఘాయిత్యం!

దేశంలో రోజురోజూకు కామంధుల ఆగడాలు పెరిగిపోతున్నాయి.మృగాళ్లల ప్రవర్తిస్తూ తమ కామ వాంఛ తీర్చుకుంటున్నారు.

అభం శుభం తెలియని చిన్నారుల నుంచి కాటికి కాలు చాచిన ముసలివాళ్లను సైతం వదలటంలేదు.

చివరికి విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు కూడా విద్యార్థులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.నిర్భయ వంటి చట్టాలు ఉన్నప్పటికి కూడా ఏమీ పని చేయడంలేదు.

ముఖ్యంగా మానభంగాలకు గురయ్యే ప్రతి నలుగురిలో ఒకరు మైనర్ బాలిక కావడం విచారించాల్సి విషయం.

రాజస్థాన్‌లో 13 ఏళ్ల విద్యార్థినిపై ఉపాధ్యాయులు ఏడాదిగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అల్వార్ జిల్లాలోని నారాయణ్‌పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

నారాయణ్‌పూర్‌లోని ఓ పాఠశాలలో చదువుతున్న ఓ బాలికపై పాఠశాల మేనేజర్, ఉపాధ్యాయులతోపాటు ఇతర సిబ్బంది ఏడాదిగా అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు బాధిత బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇటీవల బాలిక అనారోగ్యానికి గురికావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.ఏడాది కాలంగా బాలికపై అత్యాచారానికి పాల్పపడుతున్నారని, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపుతామని బాలికను బెదిరించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

దీంతో పోలీసులు 13 మందిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.వారిపై పోక్సో సహా భారత శిక్షా స్మృతిలో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

కాగా, నిందితులకు సహకరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు మహిళా టీచర్లపైనా కూడా కేసులు నమోదయ్యాయి.

జుట్టు రాలకుండా ఉండాలంటే వారానికి రెండు సార్లైనా ఈ ఆయిల్ వాడండి!