దొంగగా మారిన టీచర్.. గ్యాంగ్ ను ఏర్పరుచుకుని !
TeluguStop.com

కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా చాలా మంది బతుకులు రోడ్డున పడ్డాయి.


లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు.గత 5 నెలలుగా క్లిష్ట పరిస్థితుల్లో జీవితం సాగిస్తున్నారు.


వీరిలో ఎక్కువగా ప్రైవేట్ టీచర్ల సంఖ్య అధికంగా ఉంది.ఉపాధి కోల్పోయి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఇంటిని నెట్టుకొస్తున్నారు.
కూరగాయలు అమ్ముతూ కొందరు.టిఫిన్ సెంటర్లు.
కుల వృత్తుల పనులు చేస్తున్నారు.సమాజంలో ఉపాధ్యాయులకు ప్రత్యేక గుర్తింపు, మర్యాద ఉంటుంది.
కానీ, ఓ టీచర్ లాక్ డౌన్ కారణంగా దొంగగా మారాడు.దొంగగా మారి కొందరు వ్యక్తులను దగ్గరికి తీసుకుని గ్యాంగ్ ను ఏర్పరుచుకుని గ్యాంగ్ కు లీడర్ గా కొనసాగాడు.
దొంగతనానికి పాల్పడటంతో పోలీసులు కేసును చేధించి వారిని పట్టుకుని అరెస్ట్ చేశారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన కోసూరి శ్రీనివాసరావు(54) పదేళ్ల క్రితం వనపర్తిలో ప్రైవేట్ స్కూల్ టీచర్.
అప్పట్లో స్కూళ్లో అటెండర్ గా పని చేస్తున్న ఉదయ్ తన సోదరుడు ఇచ్చిన 10 తులాల బంగారం ఇచ్చాడు.
పోలీసులు పట్టుకుని అది దొంగలించిన బంగారమని చెప్పారు.దీంతో అప్పటి నుంచి శ్రీనివాస్ దొంగగా మారి కొంత మందిని ఏర్పాటు చేసుకున్నాడు.
గ్యాంగ్ కు నాయకుడిగా నిర్వహిస్తు పోలీసులకు పట్టుబడిన దొంగలను విడిపించేవాడు.ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఈ దొంగల ముఠాపై 48 కేసులున్నాయి.
శంషాబాద్ లో దొంగతనానికి పాల్పడటంతో పోలీసులు ఆ దొంగలను పట్టుకుని అరెస్ట్ చేశారు.
అలా జరగకపోతే నన్ను నమ్మకండి.. న్యాచురల్ స్టార్ సంచలన వ్యాఖ్యలు వైరల్!