టీడీపీకి ప్రాణం పోయడం పవన్ వల్ల కాదు..: మంత్రి అంబటి

టీడీపీ, జనసేనపై మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా మండిపడ్డారు.చంద్రబాబు అరెస్టుపై టీడీపీ గగ్గోలు పెడుతోందన్నారు.

చంద్రబాబు కుటుంబం కంటే కూడా ఎక్కువగా పవన్ బాధపడుతున్నారని తెలిపారు.ప్రజలు, జనసేన క్యాడర్ ను పవన్ కల్యాణ్ మోసం చేస్తున్నారని మంత్రి అంబటి మండిపడ్డారు.

టీడీపీ - జనసేన కలిసి పోటీ చేస్తే అయ్యేదేమీ లేదని చెప్పారు.బీజేపీతో సంప్రదించకుండానే టీడీపీతో పవన్ పొత్తు పెట్టుకున్నారన్నారు.

రాజకీయంగా, వ్యక్తిగతంగా పవన్ కు ఎలాంటి నైతిక విలువలు లేవని తెలిపారు.ఈ క్రమంలోనే టీడీపీ - జనసేన పొత్తు అట్టర్ ఫ్లాప్ అవుతుందని వెల్లడించారు.

టీడీపీతో పొత్తు పెట్టుకుని పవన్ జనసేన ప్రాణం తీశారని విమర్శించారు.అయితే టీడీపీకి ప్రాణం పోయడం మాత్రం పవన్ వల్ల కాదన్న మంత్రి అంబటి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ పవన్ వల్ల కాదని తెలిపారు.

చంద్రబాబు అన్యాయాలు, అక్రమాలను పవన్ ఖండించరని స్పష్టం చేశారు.

కోల్ కత్తా బాధితురాలిపై అసభ్యకర పోస్టులు.. మంచు మనోజ్ సెన్సేషనల్ ట్వీట్ వైరల్!