అసెంబ్లీలో స్కాంపై చర్చిస్తుంటే టీడీపీ పారిపోయింది..: మంత్రి రోజా

టీడీపీ ఎమ్మెల్యేలకు మంత్రి రోజా ఛాలెంజ్ విసిరారు.ఈక్రమంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు దమ్ముంటే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం అంశంపై ఈడీ విచారణ కోరాలని డిమాండ్ చేశారు.

అసెంబ్లీలో ఈ స్కాంపై చర్చిస్తుంటే టీడీపీ పారిపోయిందని మంత్రి రోజా విమర్శించారు.చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసిందన్న ఆమె ఇప్పుడు కోర్టుకు వెళ్లి తొడ కొడతావా అని బాలయ్యను ప్రశ్నించారు.

చంద్రబాబు అరెస్టుతో టీడీపీ నేతలకు పిచ్చి పట్టినట్లుందని ఎద్దేవా చేశారు.కాగా చంద్రబాబు క్వాష్ పిటిషన్ హైకోర్టులో డిస్మిస్ కాగా విజయవాడ ఏసీబీ కోర్టు చంద్రబాబును రెండు రోజుల కస్టడీకి ఇస్తూ అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఈ రెండు రకాల గింజలు మీ డైట్ లో ఉంటే మీరు బరువు తగ్గడం గ్యారంటీ!