టీడీపీ ఎమ్మెల్యే స్థానాలే టార్గెట్‎గా వైసీపీ అడుగులు..!

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతుంది.దీనిలో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే స్థానాలే టార్గెట్ గా వైసీపీ అడుగులు వేస్తోంది.

ఈ మేరకు ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ టీడీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.

తాజాగా మండపేట నియోజకవర్గ నేతలతో సీఎం జగన్ సమావేశం అయ్యారు.ఈ క్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.

అయితే ఇప్పటికే కుప్పం, అద్దంకి, టెక్కలి నియోజకవర్గ నేతలతో జగన్ వరుస సమీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ జెండానే ఎగిరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్టీ నేతలకు సూచించారు.

వావ్, ఏపీలో 139,000 ఏళ్ల నాటి పురాతన రాతి పనిముట్లు లభ్యం..?