వైసీపీ నేత ఇంటికి వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు…!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎన్ని పార్టీలు ఉన్న.పోటీ మాత్రం వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య అన్నట్టు పొలిటికల్ వాతావరణం ఉంటుంది.

రెండు పార్టీల నేతలు చాలా విషయాల్లో నువ్వా నేనా అన్నట్టుగా వ్యవహరిస్తారు.ఇటీవల ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలలో ఒకరిపై మరొకరు దాడులు కూడా చేసుకోవడం జరిగింది.

పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్న రీతిలో టీడీపీ.వైసీపీ మధ్య వాతావరణం ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం టీడీపీ పార్టీ మంచి జోరు మీద ఉంది.పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో అది రాయలసీమలో టీడీపీ అభ్యర్థులు గెలవడం సంచలనంగా మారింది.

పరిస్థితి ఇలా ఉంటే పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు.( Nimmala Ramanaidu ) పోరాటాల విషయంలో ప్రతిపక్షనేతగా చాలా కీలకంగా వ్యవహరిస్తుంటారు అన్న సంగతి తెలిసిందే.

వైసీపీ ( YCP ) ప్రభుత్వం పై చాలా వినూత్నంగా సీరియస్ అవుతూ.

పోరాడుతూ ఉంటారు.అటువంటిది ఆయన పాలకొల్లు పట్టణ వైసీపీ టౌన్ ప్రెసిడెంట్ చందాక సత్తిబాబు( Chandaka Sattibabu ) ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగింది.

"""/" / సత్తిబాబు ఇటీవల హార్ట్ సర్జరీ చేయించుకోవడం జరిగింది.ప్రస్తుతం ఇంటి వద్దనే విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో మంగళవారం టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు.సుధాకర్ ఇంటికి వెళ్లి పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఇదే సమయంలో పట్టణంలో మరి కొంతమందిని ప్రజలను ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కలవడం జరిగింది.

Chiranjeevi : నాగబాబు విషయం లో చిరంజీవి ని హేళన చేసిన ఇండస్ట్రీ పెద్దలు…