వైయస్ జగన్ కి ఎన్నికలంటే భయం టీడీపీ నేత కళా వెంకట్రావు సంచలన వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) రాష్ట్రంలో రాజకీయాలు వాడి వేడిగా ఉన్నాయి.ఒక్కో ప్రాంతంలో ఒక్కో ముఖ్య నేత.

యాత్రలు.సభలు నిర్వహిస్తూ.

ప్రత్యర్థులపై విమర్శలు చేస్తున్నారు.ఇక ఇదే సమయంలో అధికార పార్టీ వైసీపీ ప్రజా ప్రతినిధులపై సర్వేలు నిర్వహిస్తూ వాటి ఆధారంగానే వచ్చే ఎన్నికలలో టికెట్ కేటాయింపులు ఉంటాయని.

హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది.పరిస్థితి ఇలా ఉంటే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు( Kala Venkatarao ) వైసీపీ అధ్యక్షుడు సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

వైయస్ జగన్( YS Jagan ) కు ఎన్నికలంటే భయం పట్టుకుందని సెటైర్లు వేశారు.

రాబోయే ఎన్నికలలో ప్రజలు వైసీపీనీ బంగాళాఖాతంలో కలిపేయడం గ్యారెంటీ అని హెచ్చరించారు.జగన్ కు ప్రజలు ఇచ్చిన ఒక అవకాశం అయిపోయింది.

మరో అవకాశం ప్రజలు ఇవ్వదలుచుకోలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.వైయస్ జగన్ కు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం చేతకాదని హెచ్చరించారు.

కేవలం అప్పులు చేయడం మాత్రమే తెలుసు అని.అభివృద్ధి ఎలా చేయాలో వైఎస్ జగన్ కి తెలియదని అన్నారు.

సంక్షేమ పథకాలకు తెలుగుదేశం పెట్టింది పేరు అని కళా వెంకట్రావు పేర్కొన్నారు.ఈ ఏడాది చివరిలోనే ఎన్నికలు జరగనున్నాయని కచ్చితంగా తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని కళా వెంకట్రావు జోష్యం చెప్పారు.

లోకేష్ పాదయాత్రకి అద్భుతమైన స్పందన వస్తుందని వివరించారు.గురువారం పాయకరావుపేటలో భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య యాత్ర బహిరంగ సభలో కళా వెంకట్రావు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

యూఎస్ కంటే ఇండియా బెస్ట్.. ఢిల్లీలో జీవితం అద్భుతం.. అమెరికన్ కామెంట్స్ వైరల్..?