టీడీపీ-జనసేన కలిసి పోటీ చేయాల్సిందే.. హరిరామ జోగయ్య

మాజీ మంత్రి హరిరామ జోగయ్య మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.ఏపీలో టీడీపీ మరియు జనసేన కలిసి పోటీ చేయాల్సిందేనని పేర్కొన్నారు.

ఈ క్రమంలో పోటీ చేసే స్థానాలు, పదవులను టీడీపీ, జనసేన పార్టీలు సమానంగా పంచుకోవాలని తెలిపారు.

లేని పక్షంలో జనసేన కంటే టీడీపీనే ఎక్కువగా నష్టపోతుందని ఆయన సూచించారు.ఈసారి టీడీపీకి అధికార భాగస్వామ్యం లేకపోతే భవిష్యత్ ఇబ్బందికరమేనని వెల్లడించారు.