TDP ChargeSheet : వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై టీడీపీ చార్జ్‎షీట్..!

ఏపీలోని సీఎం జగన్( CM Jagan ) ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్ష పార్టీ టీడీపీ( TDP ) ఇవాళ చార్జ్‎షీట్ విడుదల చేయనుంది.

ఈ మేరకు ‘ ప్రజా కోర్టు’( Praja Court ) పేరుతో తెలుగుదేశం పార్టీ చార్జ్‎షీట్ రిలీజ్ చేయనుంది.

ఐదేళ్ల వైసీపీ పాలనలో వైఫల్యాలతో పాటు నవరత్నాలు - నవమోసాలు అయ్యాయని ఆరోపిస్తూ టీడీపీ నేతలు చార్జ్‎షీట్ తయారు చేశారు.

"""/" / మరోవైపు ఇవాళ టీడీపీ శానససభా పక్ష సమావేశం జరగనుంది.ఇందులో ప్రధానంగా అసెంబ్లీ సమావేశాల్లో( Assembly Sessions ) అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.

త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.అటు వైసీపీ ప్రభుత్వానికి కూడా చివరి అసెంబ్లీ సమావేశాలు కావడంతో అన్ని వ్యూహాలను టీడీపీ సిద్ధం చేస్తుందని సమాచారం.

డ్రై హెయిర్ తో డోంట్ వర్రీ.. ఒక్క వాష్ తో రిపేర్ చేసుకోండిలా!