జగన్ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేశారు : బోండా ఉమ

జగన్ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేశారు.గతంలో ఏ ముఖ్యమంత్రికి రానటువంటి ప్రజా వ్యతిరేకత జగన్ కు వచ్చింది.

రాబోయే ఎన్నికలలో వైసీపీ కేవలం సింగిల్ సంఖ్యకే పరిమితం అవుతుందని సర్వే నివేదికలు చెబుతున్నాయి.

అంతర్జాతీయ క్రిమినల్ గ్యాంగ్ మొత్తం వైసీపీలోనే ఉన్నారు.తాడేపల్లి కేంద్రంగా దొంగల ముఠా మొత్తం పని చేస్తుంది.

జైలుకు వెళ్లినోళ్లు, క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్లు మీ పార్టీలో ఉన్నారు .

మీరు చంద్రబాబును, పవన్ కళ్యాణ్ ను నోటికొచ్చినట్లు తిడతారు.జంగారెడ్డి గూడెంలో కల్తీ సారా కారణంగా 26మంది చనిపోతే.

తేలిగ్గా తీసుకున్నారు.చంద్రబాబు బాధ్యతతో కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్ధిక సాయం ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ ఆత్మహత్య చేసుకున్న రైతుల కోసం తన సొంత డబ్బు ఐదు కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు.

ప్రజలకు మేలు చేసే వాళ్లు జగన్ దృష్టిలో దొంగలుగా ఉంటారా.నేడు జగన్ నిరాశ, నిస్పృహలతో ఉన్నాడు.

పీకె ఇచ్చిన సర్వే రిపోర్టులతో జగన్ భయపడుతున్నాడు.నవరత్నాలు అని.

నవమోసాలు చేసిన చరిత్ర జగన్ ది.ఏమైనా సందేహాలు ఉంటే.

పీకె ఇచ్చిన రిపోర్టు మళ్లీ చదువుకో.రాష్ట్రాన్ని లూఠీ చేసి.

ప్రజ ధనాన్ని దోచుకున్నారు.నీ తప్పులు ఎత్తి చూపితే.

నీ అవినీతిని బయటపెడితే.ఎల్లో మీడియా అని మాట్లాడతావా.

నీ క్యాబినెట్ మంత్రులతో రాజీనామాలు చేయడం కాదు.నువ్వు రాజీనామా చేసి.

అసెంబ్లీని రద్దు చేయి.నీకు సవాల్ చేస్తున్నాం.

దమ్ముంటే ఎన్నికలకు రా.95శాతం సంక్షేమ పధకాలను నిజంగా అమలు చేసి ఉంటే.

నీకే ప్రజలు పట్టం కడతారు.మా సవాల్ ను స్వీకరించి .

ఎన్నికలకు రా.ప్రజలు నీ మీద ఆగ్రహంగా ఉన్నారని.

కొత్త నాటకం చేపట్టావు.నీ డబ్బా గ్యాంగ్ తో పొగడించుకుంటూ.

ప్రజలను మోసం చేసేందుకు డ్రామాలు ఆడుతున్నావు.టీడీపీకి పొత్తులు ఏమీ కొత్త కాదు.

ప్రజల అవసరాల కోసం అనేక సార్లు పెట్టుకున్నారు.నీలాంటి అవినీతి పరుడు, అవినీతి పార్టీతో పొత్తులు పెట్టుకునేందుకు ఎవరైనా వస్తారా.

పొత్తుల గురించి మేమే మాట్లాడుకోలేదు., నీకెందుకు అంత భయం.

మా పొత్తుల గురించి నువ్వు వ్యాఖ్యలు చేస్తున్నావంటే.వణుకు మొదలైందనేగా అర్దం.

వైసీపీ ప్రభుత్వం విధానాల వల్ల రాష్ట్రం ఆర్ఖిక కష్టాల్లో చిక్కుకుంది.మోడీ నీ తప్పులను నీతోనే చదివించి.

నీకు క్లాస్ పీకితే.బయట సిగ్గులేకుండా మాట్లాడతావా.

రాష్ట్రం కోసమే అయితే.మోడీ, జగన్ భేటీ లో అధికారులు ఎందుకు లేరు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం చర్చించానని బైబిల్ పై మీద ఒట్టేసి చెప్పు.ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక కాబోతుందని జాతీయస్థాయిలో చర్చ జరగడం నీకు సిగ్గుగా అనిపించడం లేదా.

ఈ అంశంపై మోడీ పిలిపించి నిలదీస్తే.అది కప్పిపుచ్చుకునేందుకు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తావా.

ఒక్క ఛాన్స్ అన్న జగన్.ప్రజల జీవితాలను నాశనం చేశాడు.

జగన్ వైఫల్యాలను, మాఫియాలను, అవినీతిని టీడీపీ ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తూనే ఉంది.ప్రజలు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తూనే ఉన్నాం.

మూడేళ్లుగా దోచుకున్న మంత్రులు.ఈరోజు బాధ పడుతూ వెళుతున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.

ఎన్నికలకు వస్తే.ప్రజలు ఎవరివైపు ఉన్నారో తేలిపోతుంది.

జగన్ కు నమ్మకం ఉంటే మా సవాల్ ను స్వీకరించాలి.నువ్వు గెలిస్తే.

ఏం చెప్పినా చేసేందుకు మేము సిద్దంగా ఉన్నాం.వచ్చే ఎన్నికలలో వైసిపి తరపున తొమ్మిది మంది మాత్రమే గెలుస్తారని నివేదికలు వారికే వచ్చాయి.

బాబాయి గుండెపోటు అని చెప్పి.మాయ చేశారు.

హత్య చేసిన వారిని జగన్ కాపాడటం నిజంగా సిగ్గు చేటు.వివేక హత్య తరువాత జగన్ ఎన్ని డ్రామాలు ఆడాడో అందరూ చూశారు.

నిజం చెబితే చస్తారు…ఆ భాద మీకు తెలియదు పూనమ్ సంచలన వ్యాఖ్యలు!