బాలయ్య అండగా నిలిచారు… అలేఖ్య రెడ్డి ఎమోషనల్ పోస్ట్ వైరల్!

నందమూరి తారకరత్న గత నెల 18వ తేదీ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన విషయం మనకు తెలిసిందే.

జనవరి 27వ తేదీ ఒకసారిగా స్పృహ తప్పి పడిపోయిన 23 రోజులపాటు హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ చివరికి ఫిబ్రవరి 18వ తేదీ తుది శ్వాస విడిచారు.

ఇలా తారకరత్న (Tarakaratna) మరణించి దాదాపు నెల అవుతున్నప్పటికీ ఇంకా ఆయన మరణ వార్త నుంచి బయటపడలేకపోతున్నారు.

ముఖ్యంగా తన భార్య అలేఖ్య రెడ్డి(Alekhya Reddy) ఎప్పటికప్పుడు తారకరత్న తలుచుకుంటూ ఆయనపై ఉన్నటువంటి ప్రేమను బయటపెడుతున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా అలేఖ్య రెడ్డి తన ముగ్గురు పిల్లలతో కలిసి ఉన్న ఫోటోతో పాటు తారకరత్నను కూడా మార్ఫింగ్ చేసినటువంటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ఇందులో ఈమె బాలకృష్ణ గురించి చెబుతూ.ఎవరినైతే మేము కుటుంబం అని చెప్పగలుగుతామో.

ఎవరైతే మాకు ఇబ్బంది కలిగినప్పుడు.సంతోషం కలిగినప్పుడు.

మా వెంటే ఉంటూ మాకు అండగా నిలబడి మమ్మల్ని కాపాడుతున్నారో తనే బాలకృష్ణ(Balakrishna).

"""/" / చివరి వరకు తారకరత్నకు ఆయనే అండగా నిలిచారు.మిమ్మల్ని హాస్పిటల్ కు ఒక తండ్రిలా తీసుకెళ్లారు.

ఒక తల్లిలా లాలిపాడుతూ మీ బెడ్ పక్కనే కూర్చున్నారు.ఎవరు లేని సమయంలో తాను జోక్స్ వేస్తూ మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం చేశారు.

తన జోక్స్ కు మీరు రియాక్ట్ అవుతారేమోనని ఎదురు చూశారు.నువ్వు ఇంకా కొద్ది రోజులు బ్రతికుంటే బాగుండేది నిన్ను చాలా మిస్ అవుతున్నాను అంటూ ఈమె ఎమోషనల్ పోస్ట్ చేశారు.

"""/" / ఇక ఈ ఫోటో ఎవరు మార్ఫింగ్ చేశారో తెలియదు కానీ అచ్చం నిజమైన ఫోటోలాగే ఉంది.

ఇది ఒక అద్భుతమైన ఎడిటింగ్ ఫోటో థాంక్యూ సో మచ్ నందమూరి బాలకృష్ణ.

జై బాలయ్య తారకరత్న అంటూ అలేఖ్య రెడ్డి తన కుటుంబానికి బాలయ్య ఎంత అండగా నిలిచారో చెబుతూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ప్రస్తుతం తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి చేసినటువంటి ఈ పోస్టు వైరల్ గా మారింది.

ఎయిర్ హోస్టెస్‌కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ప్యాసింజర్.. ఆమె రియాక్షన్ చూస్తే..?