అమరావతి రైతుల పాదయాత్రకు తారకరత్న సంఘీభావం

అమరావతి రైతుల పాదయాత్రకు రోజురోజుకు ప్రజాధరణ తిరుగుతున్న నైపద్యంలో అమరావతి రైతులకు నందమూరి తారకరత్న సంఘీభావం తెలిపారు.

తూర్పుగోదావరి జిల్లా మోరంపూడి హుకుంపేటలో జరుగుతున్న రైతుల పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు.ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని తారకరత్న చెప్పారు.

రైతులు నిస్వార్థంగా భూములు ఇచ్చారని.వారికి మద్దతు తెలపాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రభుత్వంలో రౌడీయిజం పెరిగిపోయిందని విమర్శించారు.టీడీపీకి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.

మహేష్ బాబుతో ఆ సినిమా చేసి తప్పు చేశాను.. శ్రీనువైట్ల సంచలన వ్యాఖ్యలు!