ఇంకోసారి ఏడిస్తే గుడ్ బై చెప్తా.. కన్నీళ్లు తెప్పిస్తున్న తారకరత్న కూతురు మాటలు!
TeluguStop.com
తారకరత్న అలేఖ్యారెడ్డి కూతురు నిషిక గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
తారకరత్న మరణించిన సమయంలో నిషిక కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి.
తాజాగా నిషిక రాసిన ఎమోషనల్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.భర్త చనిపోయిన బాధ నుంచి కోలుకోలేక అలేఖ్యారెడ్డి ఇప్పటికీ బాధ పడుతుండటంతో నిషిక ఈ పోస్ట్ చేసినట్టు తెలుస్తోంది.
"""/" /
నిషిక తన పోస్ట్ లో "అమ్మా.నువ్వు చాలా బాధలో ఉన్నావు.
నువ్వు ఇంకోసారి ఏడిస్తే గుడ్ బై చెబుతా అని చెప్పుకొచ్చారు.నిషిక చిన్న వయస్సులోనే తల్లిపై ప్రేమను వ్యక్తపరచటంతో పాటు తల్లి ఏడిస్తే తాను అస్సలు తట్టుకోలేనని నిషిక కామెంట్లు చేస్తున్నారు.
నిషిక రాసిన నోట్ ను అలేఖ్య ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
"""/" /
నిషిక మాటల్లోని మీనింగ్ ను అర్థం చేసుకున్న నెటిజన్లు అలేఖ్య బాధను చూసి నిషిక కూడా బాధ పడుతోందని అలేఖ్య కూతురిని బాధ పెట్టకుండా అడుగులు వేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
అలేఖ్య రెడ్డి బాధలను తట్టుకుంటూ కెరీర్ పరంగా ముందడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉంది.
నిన్ను చాలా మిస్ అవుతున్నా చిన్నమ్మా నిషికమ్మా అంటూ అని అలేఖ్య తెలిపారు.
"""/" /
అలేఖ్యారెడ్డికి నందమూరి కుటుంబ సభ్యుల సపోర్ట్ అవసరం ఉంది.నందమూరి బాలకృష్ణ ఇప్పటికే అలేఖ్య కుటుంబానికి సపోర్ట్ చేస్తుండగా మిగతా నందమూరి కుటుంబ సభ్యుల సపోర్ట్ కూడా అవసరం అని చెప్పవచ్చు.
అలేఖ్యారెడ్డి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని వినిపిస్తున్నా పొలిటికల్ వర్గాల్లో మాత్రం అలేఖ్య ఎంట్రీ గురించి ఎలాంటి కామెంట్లు వినిపించడం లేదు.
అలేఖ్య రాజకీయాల్లోకి వస్తారో లేక వ్యాపారాల్లోనే కెరీర్ ను కొనసాగిస్తారో చూడాల్సి ఉంది.
మా ఇంటికి చిట్టితల్లి వచ్చింది… ఎమోషనల్ పోస్ట్ చేసిన శ్రీ లీల!