సోనూ సూద్ బాటలో తాప్సీ.. ఏం చేసిందంటే?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా బాలీవుడ్ నటుడు సోనూ సూద్ పేరు వినిపిస్తోందనే విషయం అందరికీ తెలిసిందే.

కరోనా వైరస్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో ఎలాంటి సహాయానికైనా తాను రెడీ అంటూ ముందుకు వస్తున్న ఈ నటుడు, తన సొంత ఖర్చులతో వారికి సహాయం చేస్తున్నాడు.

లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికులను తమ సొంతూళ్లకు పంపేందుకు సోనూ సూద్ చేసిన సహాయం గురించి అందరికీ తెలిసిందే.

ఇక ఆ తరువాత ఏదో ఓ రకంగా ప్రజలకు సాయం చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్న సోనూ సూద్, ఇటీవల చిత్తూరుకు చెందిన ఓ రైతుకు ట్రాక్టర్‌ను అందించి దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచాడు.

అయితే ఇప్పుడు పలువురు సెలబ్రిటీలు సోనూ సూద్‌ను ఫాలో అయ్యేందుకు రెడీ అవుతున్నారు.

ఈ క్రమంలోనే బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను కూడా తనవంతు సాయంగా ఓ విద్యార్ధి చదువు కోసం ఐఫోన్‌ను కొని పెట్టింది.

పీయూసీ పరీక్షల్లో 94 శాతం మార్కులు తెచ్చుకున్న కర్ణాటకు చెందిన ఓ విద్యార్ధినికి లాక్‌డౌన్ కారణంగా చదువుకోవడానికి సెల్‌ఫోన్ అవసరం అయ్యింది.

ఈ విషయాన్ని ఆమె తండ్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, తాప్సీ ఈ పోస్ట్‌ను చూసి సదరు విద్యార్ధినికి ఐఫోన్‌ను అందించింది.

తాప్సీ చేసిన సాయం తనకు చాలా ఉపయోగపడుతుందని, ఆమె సాయం ఎప్పటికీ మరిచిపోలేనని ఆ విద్యార్ధిని సంతోషం వ్యక్తం చేస్తోంది.

మొత్తానికి సోనూ సూద్ బాటలో మరికొందరు సెలబ్రిటీలు ముందుకు వచ్చి ఇలాంటి మంచి పనులు చేయాలని అభిమానులు కోరుతున్నారు.

నిన్ను వదిలేదే లేదు… మరోసారి విజయ్ దేవరకొండ అని గెలికిన అనసూయ?