తాంత్రిక పూజలు ... లవంగం !  ఇలాగే వదిలేయ్యకండిరా !

కేసిఆర్ తాంత్రిక పూజలు చేశాడని టిఆర్ఎస్ పార్టీ పేరుతో ఎన్నికలకు వెళ్తే ఎన్నికల్లో గెలవదని,  అందుకే పేరు మార్చారని తాంత్రికలు చెప్పడంతోనే కేసీఆర్ జాతీయ పార్టీని స్థాపించి బిఆర్ఎస్ గా మార్చారని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వాఖ్యలపై టిఆర్ఎస్ మంత్రి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

ఈ మేరకు బండి సంజయ్ ని ఉద్దేశించి లవంగం అంటూ విమర్శలు చేశారు.

బండిని అలా వదిలేయవద్దని,  సమాజానికి ప్రమాదకరంగా మారుతాడని చెప్పిన కేటీఆర్ వీలైనంత తొందరగా ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో సంజయ్ ను చేర్చాలని సలహా ఇచ్చారు.

'' ఈ లవంగం గారిని ఇలాగే వదిలేయకండి రా బిజెపి బాబులు.పిచ్చి ముదిరి తొందర్లో కరవడం మొదలుపెడతాడేమో, మతిలేని మాటలతో సమాజానికి ప్రమాదకరంగా తయారయ్యాడు.

ఎర్రగడ్డ లో బెడ్ తయారు గా ఉంది.తొందరగా తీసుకువెళ్లి వైద్యం చేయించుకోండి.

  అంటూ కేటీఆర్ తనదైన శైలిలో సంజయ్ పై విమర్శలు చేశారు.  """/" /  ఈ విమర్శలపై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటుగానే స్పందించి కౌంటర్ ఇచ్చారు.

ఈ మేరకు కేటీఆర్ చేసిన ట్వీట్ కు రీ ట్వీట్ చేసిన బండి సంజయ్.

''  కెసిఆర్ ఫామ్ హౌస్ లో సకుటుంబ సమేతంగా తాంత్రిక పూజలు చేసిండు.

ఆ పూజల అనంతరం వాటిని కాలేశ్వరం పోయి ఆ నీళ్ళ లో  కలిపిండు.

పైకి మాత్రం కాలేశ్వరం ప్రాజెక్టును పరిశీలించేందుకు వెళ్తున్నానని చెప్పిండు ''  అంటూ రీ ట్వీట్ లో విమర్శించారు.

ఇక ఇదే అంశం పై టీఆర్ఎస్ బీజేపీ లు పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ హడావుడి చేస్తుండగా కాంగ్రెస్, టిఆర్ఎస్,బిజెపి కార్యకర్తలు సోషల్ మీడియా ద్వారా దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు , ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు.

రేణు దేశాయ్ కు చీర సారే పెట్టి సత్కరించిన తెలంగాణ మంత్రి.. కారణం ఇదేనా?