వైకల్యం ఉన్నా బంగారు పతకం సాధించిన తనీషా… ఈమె సక్సెస్ కు వావ్ అనాల్సిందే!

సాధారణంగా వైకల్యం ఉన్నవాళ్లు లక్ష్యాలను సాధించడంలో ఎన్ని ఆటంకాలు ఎదురవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు.

వైకల్యం ఉన్నా బంగారు పతకం సాధించి తనీషా( Tanisha ) వార్తల్లో నిలవగా ఆమె సక్సెస్ స్టోరీ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.

తనీషా స్కూల్ లో చదువుకునే సమయంలో ఎడమ చేతిని ఎప్పుడూ స్కర్ట్ జేబులో పెట్టుకుని ఆ చెయ్యి కనిపించకుండా జాగ్రత్త పడేవారు.

మణికట్టుకు దుపట్టా కట్టుకుని మరీ తన చెయ్యి ఎవరికీ కనిపించకుండా తనీషా వ్యవహరించేవారు.

అయితే వైకల్యం ఉన్నా బంగారు పతకం( Gold Medal ) సాధించిన తనీషా తన సక్సెస్ స్టోరీతో ప్రశంసలు అందుకుంటున్నారు.

13వ జాతీయ జూనియర్ పారా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో 400 మీటర్ల పరుగు పందెంలో రజత పతకం గెలవడం ద్వారా ఆమె వార్తల్లో నిలిచారు.

రాజస్థాన్ లోని( Rajasthan ) సికార్ జిల్లాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న తనీషా అంగ వైకల్యాన్ని దాచిపెట్టడం ద్వారా ఒంటరితనాన్ని ఎదుర్కొన్నారు.

"""/" / ప్రస్తుతం నా చెయ్యిని దాచాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు.

ప్రస్తుతం నా ఎడమ చెయ్యి ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని తనీషా వెల్లడించారు.గతంలో నలుగురితో కలవడానికి ఇబ్బంది పడిన తనీషా ప్రస్తుతం ఆ పరిస్థితి మారిందని పేర్కొన్నారు.

ప్రస్తుతం నన్ను ఎవరూ ఎగతాళిగా కామెంట్స్ చేయడం లేదని ఆమె చెప్పుకొచ్చారు.గతేడాది జాతీయ, రాష్ట్ర ఛాంపియన్ షిప్ లలో తనీషా మూడు స్వర్ణాలు, ఒక రజతం, ఒక క్యాంసం గెలిచారు.

"""/" / తాను సాధించిన పతకాలు నా లైఫ్ ను మార్చడంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని నింపేశాయని ఆమె అన్నారు.

గతంతో పోల్చి చూస్తే నా ఆలోచనా ధోరణి సైతం మారిందని ఆమె పేర్కొన్నారు.

తనీషా సక్సెస్ స్టోరీని( Tanisha Success Story ) ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఆదోని ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా జీ తెలుగు మెగా ఈవెంట్ ‘శ్రావణలక్ష్మి’, ప్రేమలు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఈ ఆదివారం మీ జీ తెలుగులో!