తనికెళ్ల భరణి కొడుకు ఏం చేస్తాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

క్యారెక్టర్ ఆర్టిస్ట్ తనికెళ్ల భరణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఎన్నో పాత్రల్లో నటించి తనికెళ్ల భరణి టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

తండ్రి పాత్ర అయినా.విలన్ పాత్ర అయినా ఏదైనా సరే అద్భుతంగా చెయ్యడం తనికెళ్ల భరణి సొంతం.

ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేసేయడం తనికెళ్ల భరణి ప్రత్యేకత.అయితే తనికెళ్ల భరణి గురించి అందరికీ తెలిసినా ఆయన కుటుంబం, సంతానానికి సంబంధించిన విషయాలు బయటి ప్రపంచానికి పెద్దగా తెలియవు.

నటుడిగా మాత్రమే కాక రచయితగా కూడా గొప్ప పేరు తెచ్చుకున్న తనికెళ్ల భరణి మిథునం లాంటి సినిమాకు దర్శకత్వం వహించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

దాదాపు 800 సినిమాల్లో నటించిన తనికెళ్ల భరణి గురువు రాళ్లపల్లి.నాగార్జున కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన శివ సినిమాకు తనికెళ్ల డైలాగ్ రైటర్ గా పని చేశారు.

తనికెళ్ల టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాల్లో నటించారు.

శివునికి వీర భక్తుడైన తనికెళ్ల భరణికి ఒకే ఒక్క కుమారుడు ఉన్నాడు.అతని పేరు మహా తేజ భరణి.

తండ్రి సినిమా రంగంలో గొప్ప స్థానానికి ఎదిగితే కొడుకు గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగాడు.

చిన్నప్పటి నుంచే సామాన్య శాస్త్రంపై ఆసక్తి ఉన్న మహా తేజ భరణి ఆ ఆసక్తితోనే శాస్త్రవేత్తగా ఎదిగాడు.

తనికెళ్ల భరణి పేరును నిలబెడుతూ ఉన్నత స్థాయిలో నిలిచారు.మహా తేజ భరణి అనుకోకుండా ఒక సినిమాలో హీరోగా కూడా నటించాడు.

అయితే మహా తేజ భరణి నటించిన లవంగం సినిమా హిట్ అవ్వకపోగా తనికెళ్ల భరణి ని కూడా బాగా బాధపెట్టింది.

దీంతో నటనకు పూర్తిగా దూరమై తనకు ఆసక్తి ఉన్న రంగంలోనే గొప్ప స్థానానికి ఎదిగాడు మహా తేజ భరణి.

చియా సీడ్స్ తో హెల్తీ లడ్డు.. సాయంత్రం వేళ రోజుకొకటి తింటే బోలెడు లాభాలు!