నీటి గొడవల విషయంలో తమ్మినేని వీరభద్రం సంచలన లెటర్..!! 

సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలుగు రాష్ట్రాల నీటి గొడవలు విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

కావాలని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అని ఆరోపించారు.

జల వివాదాల విషయంలో న్యాయస్థానాన్ని లేదా కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించవచ్చు .అదే రీతిలో పరిష్కరించుకోవచ్చని స్పష్టం చేశారు.

కానీ ఈ రీతిగా వ్యవహరించకుండా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు.ప్రజలను రెచ్చగొట్టే రీతిలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.

ఇదే రీతిలో కాంగ్రెస్ పార్టీ నేత దాసోజు శ్రవణ్ కూడా ఇది కావాలని పొలిటికల్ మైలేజ్ కోసం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆడుతున్న డ్రామా అంటూ గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో విమర్శించారు.

ఇంకా ఇదే రీతిలో కృష్ణాజిల్లాలో వినియోగానికి సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్-2 తీర్పు వచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సీఎం కేసీఆర్ కి రైతు సంఘాల నాయకులు లెటర్లు  రాశారు.

 .

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే4, శనివారం 2024