National Awards: తెలుగు సినిమాలపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్న కోలీవుడ్ సినీ ఫ్యాన్స్.. వల్గర్ సినిమాలకు అవార్డులంటూ?

తాజాగా నిన్న అనగా గురువారం సాయంత్రం 69వ జాతీయ అవార్డు వేడుకల కార్యక్రమం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.

ఈ అవార్డుల ఫంక్షన్లో ఎక్కువగా తెలుగు సినిమా ఇండస్ట్రీ హవా కొనసాగింది.పుష్ప చిత్రానికి( Pushpa ) రెండు జాతీయ అవార్డులు, ఆర్ఆర్ఆర్( RRR ) చిత్రానికి 6 అవార్డులు, ఉప్పెన చిత్రానికి ఒక అవార్డు దక్కింది.

జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కూడా తెలుగు హీరో అల్లు అర్జున్ కే ( Allu Arjun ) దక్కడం విశేషం.

చరిత్రని తిరగరాస్తూ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవతరించాడు.ఇంతవరకు బాగానే ఉన్నా జాతీయ అవార్డుల పట్ల తమిళులు మాత్రం కోపంతో రగిలిపోతున్నారు.

"""/" / ఎందుకంటే నేషనల్ అవార్డు జ్యూరీ సభ్యులు సూర్య జై భీమ్,( Jai Bhim ) ధనుష్ కర్ణన్ ( Karnan ) లాంటి విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రాలని పూర్తిగా పక్కన పెట్టేశారు.

దీనికి గల కారణాలు అంతుచిక్కడం లేదు.జై భీమ్ చిత్రం ఆస్కార్ అవార్డ్స్ సమయంలో కూడా హాట్ టాపిక్ గా నిలిచింది.

ఈ చిత్రం ఆస్కార్ నామినేషన్స్ లో ఎంట్రీ ఇస్తుందని అప్పట్లో భావించారు.కానీ మిస్ అయింది.

వివక్ష అంశంపై టీజీ జ్ఞానవేల్ ఎంతో అద్భుతంగా జై భీమ్ చిత్రాన్ని రూపొందించారు.

ఈ చిత్రానికి పలు జాతీయ అవార్డులు ఖాయం అని అనుకున్నారు.మరోసారి సూర్య ( Surya ) జాతీయ ఉత్తమ నటుడు అవుతాడని తమిళులు భావించారు.

"""/" / కానీ ఈ చిత్రాన్ని జ్యూరీ సభ్యులు పట్టించుకోలేదు.గత ఏడాదే సూర్య ఆకాశం నీ హద్దురా( Akasham Nee Haddura ) చిత్రంతో జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు.

దీనితో వరుసగా రెండవ ఏడాది కూడా ఒకే నటుడికి జాతీయ అవార్డు ఇవ్వడం కుదరదనే అభిప్రాయం వినిపిస్తోంది.

అయితే మిగిలిన విభాగాల్లో ఈ చిత్రానికి ఎందుకు అవార్డు లభించలేదు? కర్ణన్ లాంటి చిత్రాన్ని కూడా జ్యూరీ ఎందుకు విస్మరించింది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో తమిళ ప్రేక్షకులు తెలుగు సినిమాపై ట్రోలింగ్ తో విరుచుకుపడుతున్నారు.పుష్ప లాంటి వల్గారిటీ ఉన్న చిత్రానికి, లాజిక్ లేని ఇతర తెలుగు చిత్రాలకు అవార్డులు ఇచ్చారు.

కానీ సహజసిద్ధమైన నటనతో, భావోద్వేగాలతో ఆకట్టుకున్న జైభీమ్ చిత్రానికి మాత్రం మొండిచేయి చూపారు అంటూ తమిళ ఆడియన్స్ ట్రోల్ చేస్తున్నారు.

పగలు జాబ్ సాయంత్రం ఇంజినీరింగ్.. రూ.2 కోట్ల జాబ్ సాధించిన ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!