మరో నటుడిని బలి తీసుకున్న కరోనా మహమ్మారి.. !
TeluguStop.com
ఈ కరోనా సెకండ్ వేవ్ మరి దారుణంగా ప్రవర్తిస్తుంది.అప్పటి దాక కనిపించిన వారు, మాట్లాడిన వారిని కోడి పిల్లలను గద్ద తన్నుకుపోయినాట్లుగ మాయం చేస్తుంది.
ఇక సినిమా రంగానికి చెందిన ఎందరో ప్రముఖులను తన పొట్టన పెట్టుకున్న కరోనా ఆకలి ఇంకా తీరనట్లుగా ఉంది.
కళామతల్లికి తీరని ద్రోహాన్ని చేస్తుంది.ఎందరో చిత్రరంగానికి చెందిన వారిని నిర్ధాక్షిణ్యంగా కబళిస్తుంది.
ఇకపోతే తాజాగా పుదుపేటై, వెన్నిలా కబాడి కుజు వంటి సినిమాల్లో తన నటన ద్వారా ప్రేక్షకుల ప్రశంసలందుకున్న తమిళ నటుడు నితీశ్ వీరా(45) కరోనాతో కన్నుమూశాడు.
ఇతను రజనీకాంత్ కాలా, ధనుష్ నటించిన అసురన్ చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు అంతే కాకుండా రీసెంట్గా విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో రూపొందుతున్న లాభంతో పాటు నీరో చిత్రంలోను నటించారు నితీశ్ వీరా ఇకపోతే నితీశ్ అకాల మరణం పై సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తమ ప్రగాఢ సానుభూతి తెలిపింది.
పవన్ ట్వీట్ కు తారక్ అందుకే రిప్లై ఇవ్వలేదా.. ఆ రీజన్ వల్లే సైలెంట్ అయ్యారా?