ఏపీలో వైసీపీ పార్టీదే అధికారం..తెలంగాణలో కాంగ్రెస్ భూస్థాపితం.. తలసాని ఆసక్తికర వాఖ్యలు

టీఆర్ఎస్ నేత, మంత్రి తలసాని శ్రీనివాస్ తాజాగా ఏపీలో ఎవరు గెలవబోతున్నారు అనే విషయంపై ఆసక్తికర వాఖ్యలు చేసారు.

ఏపీలో రానున్న ఎన్నికలలో వైసీపీ భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని, దీనిని ఎవరు ఆపలేరని మీడియాతో తెలియజేసారు.

ఏపీలో టీడీపీని, చంద్రబాబుని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, వైసీపీతోనే భవిష్యత్తు ఉంటుందని ఏపీ ప్రజలు భావిస్తున్నారని తలసాని చెప్పుకొచ్చారు.

ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా స్థాపితం కాబోతుంది అని, ఇక ఆ పార్టీకి ఇక్కడ భవిష్యత్తు లేదని చెప్పుకొచ్చారు.

ఇప్పటికే సగానికి పైగా ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరడానికి సిద్ధం అయ్యారని, మిగిలిన వాళ్ళు కూడా త్వరలో చేరిపోతారని, పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుంది అని చెప్పుకొచ్చారు.

ఇక టీఆర్ఎస్ పార్టీ లోక్ సభ ఎన్నికలలో 16 సీట్లకి పదహారు సొంతం చేసుకుంటుంది అని తెలియజేసారు.

రాజకీయ లబ్దికోసమే షర్మిల ఆరోపణలు..: ఏఏజీ పొన్నవోలు