నాకు ఏ సమస్య వచ్చినా ఆయననే పిలుస్తా.. హీరోయిన్ టబు షాకింగ్ కామెంట్స్ వైరల్!

హీరోయిన్ టబు( Heroine Tabu ) గురించి మనందరికీ తెలిసిందే.ఈమె వెటరన్ నటుల లిస్ట్ లో చేరిపోయినప్పటికీ ఏమైనా తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ ఆరాధిస్తూనే ఉంటారు.

టాలీవుడ్ లో టాప్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది టబు.

ఇది ఇలా ఉంటే హీరోయిన్ టబు తాజాగా నటించిన చిత్రం ఆరోఁ మే కహా దమ్‌ థా( Aron May Kaha Dum Tha ).

ఈ సినిమాలో అజయ్‌ దేవ్‌గణ్‌ తో స్క్రీన్‌ షేర్‌ చేసుకుంది.ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న టబు బాలీవుడ్ హీరో అజయ్‌ దేవ్‌గణ్‌ గురించి చేసిన కామెంట్లు వైరల్‌ అవుతున్నాయి.

"""/" / ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.అజయ్‌ని( Ajay ) నేను చాలా గౌరవిస్తాను.

నాకు చిత్ర నిర్మాతలతో ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు నా తరపున మాట్లాడటానికి అతణ్ని పిలుస్తాను.

ఆయన కూడా నాతో అన్ని విషయాలను షేర్‌ చేసుకుంటారు.అంతేకాదు నాతో కలిసి పనిచేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు.

మేము ఎంత క్లోజ్‌గా ఉన్నప్పటికీ నా నిర్ణయాలలో ఎప్పుడూ జోక్యం చేసుకోరు.ఒకరిని ప్రభావితం చేయడానికి అజయ్‌ ప్రయత్నించరు.

ఆయన ప్రతి ఒక్కరినీ గౌరవిస్తారు.ఇక అజయ్‌ నా సోదరుడికి చిన్ననాటి స్నేహితుడు.

"""/" / సినిమాల్లోకి రాకముందే అజయ్‌ నాకు తెలుసు.ఆయన పెళ్లి అయిన తరువాత కూడా మా స్నేహంలో ఎలాంటి మార్పు రాలేదు.

సినిమాలంటే అజయ్‌కు చాలా ఇష్టం.అయితే ఆయన దర్శకుడు కావాలని అనుకున్నారు అని చెప్పుకొచ్చింది సీనియర్‌ హీరోయిన్‌ టబు.

ఈ సందర్భంగా హీరోయిన్ టబు చేసిన వాక్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

భారతీయుడు 2 ప్లాప్ తో వణికిపోతున్న దిల్ రాజు…కారణం ఏంటంటే..?