ఒటీటీ బాటలో తాప్సి రష్మి రాకెట్ మూవీ

సౌత్ లో కమర్షియల్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న నటి తాప్సీ పొన్ను.

ఈ అమ్మడు తెలుగులో ఎక్కువగా స్టార్ హీరోలకి జోడీగా నటిస్తూ వచ్చింది.అయితే కమర్షియల్ హీరోయిన్ గా, గ్లామర్ బ్యూటీగా ఈమెని తెలుగు దర్శకులు తెరపై ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు.

ఆమె అందానికి ఇచ్చిన ప్రాధాన్యత నటనకి ఇవ్వలేదు.దీంతో కమర్షియల్ హీరోయిన్ గా సక్సెస్ అయిన తాప్సీ టాలీవుడ్ లో ఎక్కువగా సెకండ్ లీడ్ హీరోయిన్ పాత్రలకే పరిమితమైంది.

అయితే ఈ బ్యూటీ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ లేడీ ఓరియెంటెడ్ కథలతో వరుస అవకాశాలు సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది.

రీసెంట్ తాప్సీ నటించిన తప్పడ్ మూవీకి జాతీయస్థాయి అవార్డు కూడా వచ్చింది.అలాగే ఈ సినిమాలో తన నటనతో విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది తాప్సి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ అమ్మడు వరుస బయోపిక్ కథలను లైన్ లో పెట్టింది.

అథ్లెట్ రియల్ లైఫ్ స్టోరీ తో రష్మీ రాకెట్ అని మూవీని తాప్సీ పూర్తి చేసింది.

"""/"/ ప్రస్తుతం ఇండియన్ విమెన్ క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ లో నటిస్తోంది.

ఈ సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది.ఈ పాత్రల కోసం తాప్సీ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంది.

రష్మీ రాకెట్ కోసం రన్నర్ గా మారడంతోపాటు మిథాలీ రాజ్ బయోపిక్ కోసం క్రికెట్ లో ప్రావీణ్యం సంపాదించింది.

ఇదిలా ఉంటే తాప్సీ నటించిన రష్మీ రాకెట్ ప్రస్తుతం ఓటిటిలో రిలీజ్ కి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న ఈ మూవీకి ప్రముఖ ఒటిటి ఛానల్ డిజిటల్ రైట్స్ కోసం భారీ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో నిర్మాతలు కూడా డిజిటల్ రిలీజ్ కి మొగ్గుచూపినట్లు బిటౌన్ లో వినిపిస్తుంది.

త్వరలో దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇదిలా ఉంటే తర్వాత తెలుగులో కూడా కొత్త దర్శకుడితో తాప్సీ లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ తో సినిమా చేయబోతున్నట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది.

బ్లాక్ డ్రెస్ లో వంగి మరి అందాలను ఆరబోస్తున్న సమంత.. ఫోటోలు వైరల్!