టీ20 వరల్డ్ కప్ వాయిదా..!

కరోనా రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలు క్రీడ పోటీలు వాయిదా పడ్డాయి.

తాజాగా టీ20 వరల్డ్ కప్ పోటీలను వాయిదా వేస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమావేశంలో ఐసీసీ నిర్ణయం తీసుకుంది.

ఈ పురుషుల టీ20 వరల్డ్ కప్ పోటీలు 2021 అక్టోబర్ నెలలో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయం తీసుకుంది.

వచ్చే ఏడాది నవంబర్ 14వ తేదీన టీ20 ఫైనల్ మ్యాచ్ ను నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది జరగాల్సిన పోటీలను వచ్చే ఏడాదిలో అక్టోబర్ 18వ తేదీ నుంచి నవంబర్ 15 వరకు ఈ పోటీలను నిర్వహించాలని పేర్కొంది ఐసీసీ.

దీంతో పాటు 2022 టీ20 పురుషుల వరల్డ్ కప్ పోటీలు అక్టోబర్-నవంబర్ నెలలో నిర్వహించనున్నారు.

ఇక ఫైనల్ మ్యాచ్ ను అదే ఏడాది నవంబర్ 13న జరగనుందని ఐసీసీ వెల్లడించింది.

ఇక 2023 టీ20 వరల్డ్ కప్ పోటీలు అక్టోబర్- నవంబర్ మధ్య నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

ఫైనల్ మ్యాచ్ 2023 నవంబర్ 26న జరగనుందని ఐసీసీ తెలిపింది.అయితే ఈ ఏడాది పోటీలు అస్ట్రేలియాలో జరగాల్సి ఉంది.

మరోవైపు 2021, 2022 టీ 20 వరల్డ్ కప్ పోటీలు ఎక్కడ నిర్వహిస్తారో ఐసీసీ స్పష్టత ఇవ్వలేదు.

గూగుల్ గొంతు మన కర్నూలు అమ్మాయిదే.. గ్రీష్మారెడ్డి గురించి ఈ షాకింగ్ విషయాలు తెలుసా?