సత్తా చాటిన మెగాస్టార్.. సైరా నరసింహారెడ్డి నెంబర్ వన్

మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా 2019లో గుర్తుండిపోయే అంశాలను మరోసారి గుర్తుకుచేసుకుంటున్నారు అందరూ.

అలాగే 2019లో గుర్తుండిపోయే సినిమాలను ప్రేక్షకులు మరోసారి గుర్తుకు చేసుకుంటున్నారు.అయితే కొన్ని అంశాల్లో మాత్రం కొన్ని సినిమాలు చిరస్థాయిగా తమ ముద్రను వదిలాయి.

ఇలాంటి వాటిలో 2019 బుక్‌మైషో ద్వారా తెలుగులో ఎక్కువ టిక్కెట్లు అమ్ముడైన సినిమాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి రికార్డు క్రియేట్ చేసింది.

2019లో టాప్ 5 చిత్రాల్లో తమ సర్వీస్ ద్వారా ఎక్కువ టిక్కెట్లు అమ్ముడైన సినిమాగా సైరా నరసింహా రెడ్డి నిలిచినట్లు బుక్‌మైషో పేర్కొంది.

తెలుగు సినిమాలలో మజిలీ, ఎఫ్2, మహర్షి, సాహో, సైరా నరసింహారెడ్డి చిత్రాలు టాప్‌ 5గా నిలవగా, సైరా చిత్రానికి అత్యధిక టికెట్లు అమ్ముడైనట్లు బుక్‌మైషో వెల్లడించింది.

దీంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.మెగాస్టార్ ప్రతిష్టాత్మకంగా నటించిన ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేశారు.

ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో రూ.106 కోట్ల షేర్ కలెక్ట్ చేసి నాన్ బాహుబలి రికార్డును సృష్టించిన సంగతి తెలిసిందే.

రోడ్డు ప్రమాదానికి కారణమైన పోలీస్ ఛేజింగ్.. ముగ్గురు భారతీయులు దుర్మరణం, మృతుల్లో 3 నెలల చిన్నారి