ఏపీ వాణిజ్య పన్నుల విభాగంలో ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

ఏపీ వాణిజ్య పన్నుల విభాగంలో నలుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది.విచారణ కమిటీ నివేదిక మేరకు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మీడియాలో వచ్చిన కథనాలు, వ్యక్తిగతంగా ఇచ్చిన ఫిర్యాదులపై కమిటీ విచారణ చేపట్టింది.ఈ క్రమంలో కమిటీ నివేదిక ఆధారంగా జీఎస్టీ విభాగంలో పని చేస్తున్న నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ కమిషనర్ గిరిజా శంకర్ సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేశారు.

సర్కార్ సస్పెండ్ చేసిన వారిలో ప్రసాద్, మెహర్ కుమార్ , గడ్డం ప్రసాద్ లతో పాటు సంధ్యలు ఉన్నారు.

పాలకూర ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఎవరెవరు తినకూడదో తెలుసా?