సుశాంత్ పుట్టినరోజు.. సోదరి ఏం చేసిందంటే..?

బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గతేడాది జూన్ నెల 14వ తేదీన ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి తెలిసిందే.

నిన్న సుశాంత్ పుట్టినరోజు కాగా పలువురు బాలీవుడ్ ప్రముఖులు సుశాంత్ ను గుర్తు చేసుకున్నారు.

సుశాంత్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా అతని సోదరి శ్వేతా సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

యూసీ బర్క్ యూనివర్సిటీలో ఆస్ట్రోఫిజిక్స్ చదివే ఆసక్తి ఉన్న విద్యార్థుల కొరకు 25.

5 లక్షల రూపాయల స్కాలర్ షిప్ ఇస్తున్నట్టు ప్రకటన చేశారు.సుశాంత్ మెమోరియల్ ఫండ్ నుంచి ఈ మొత్తాన్ని అందజేస్తున్నట్లు శ్వేతా సింగ్ పేర్కొన్నారు.

పుట్టినరోజు శుభాకాంక్షలు మై లిటిల్ బ్రదర్.నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని తాను కోరుకుంటున్నాను అని ఆమె పేర్కొన్నారు.

సుశాంత్ తన చేతి రాతతో రాసిన ఒక లేఖను కూడా శ్వేతా సింగ్ పోస్ట్ చేశారు.

బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగీన సుశాంత్ మంచి కెరీర్ ను వదులుకుని గతేడాది ఆత్మహత్య చేసుకున్నారు.

"""/"/ సుశాంత్ ఆత్మహత్యకు సంబంధించిన సరైన కారణాలు ఇప్పటికీ వెలుగులోకి రాలేదు.బాలీవుడ్ సినీ ప్రముఖులు కంగనా, ప్రీతి జింటా, కృతీసనన్ సుశాంత్ తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

కంగనా సినీ మాఫియా సుశాంత్ ను నిషేధించిందని.వేధించిందని.

చాలాసార్లు సోషల్ మీడియాలో సహాయం కొరకు సుశాంత్ ఎదురు చూశాడని.నీకోసం అక్కడ లేకపోయినందుకు చింతిస్తున్నానని పేర్కొన్నారు.

హీరోయిన్ ప్రీతిజింతా రెండేళ్ల క్రితం సుశాంత్ పుట్టినరోజు వేడుకలను సంతోషంగా జరుపుకున్నామని.ప్రస్తుతం అవి జ్ఞాపకంగా మిగిలిపోయాయని ఆమె అన్నారు.

హ్యాపీ బర్త్ డే సుశాంత్ మిస్ యూ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

సుశాంత్ ఎక్కడ ఉన్నా శాంతితో ఉండాలని.హ్యాపీ బర్త్ డే సుశాంత్.

ఈరోజు నిన్ను ఇలా గుర్తు చేసుకుంటున్నానని పేర్కొన్నారు.

డబ్బుల ఆశ చూపి ఓటు వేయించుకోవాలని చూస్తోంది.. కాంగ్రెస్ పై ఈటల ఫైర్