సుశాంత్ మిస్ అవుతున్నా అంటూ గురించి రియా చక్రవర్తి పోస్ట్.. నెట్టింట్లో ట్రోల్?

బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గురించి మనందరికీ తెలిసిందే.

ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నాడు.

మొదటిగా టీవీ సీరియల్స్ తో కెరీర్ను ప్రారంభించిన సుశాంత్ సింగ్ ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరో రేంజ్ కీ ఎదిగాడు.

సుశాంత్ సింగ్ నటించిన ఎంఎస్ ధోని, చిచోరే లాంటి సినిమాలు సూపర్ హిట్ అవడమే కాకుండా అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

సినిమాలతో సుశాంత్ సింగ్ మరింత పాపులారిటీ సంపాదించుకున్నాడు.బాలీవుడ్ లో స్టార్ హీరోగా కెరీర్ లో దూసుకుపోతున్న సమయంలోనే అర్ధాంతరంగా తనువు చాలించాడు.

2020లో సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకుని ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.సుశాంత్ చనిపోయి  రెండు ఏళ్లు అవుతున్న కూడా అతని మరణాన్ని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇకపోతే జనవరి 21 సుశాంత్ సింగ్ పుట్టిన రోజు.సుశాంత్ 36 వ జయంతి సందర్భంగా అభిమానులతో పాటు బాలీవుడ్ లో పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సుశాంత్ కీ నివాళులు అర్పిస్తున్నారు.

"""/" / ఈ నేపథ్యంలోనే సుశాంత్ సింగ్ ప్రియురాలు రియా చక్రవర్తి సుశాంత్ సింగ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియో ని షేర్ చేసింది.

ఆ వీడియోలు సుశాంత్, రియా చక్రవర్తి ఇద్దరూ కలిసి జిమ్ లో వర్కవుట్ చేస్తున్నారు.

ఇలా చక్రవర్తి ఈ వీడియోని షేర్ చేస్తూ మిస్ యు సో మచ్ అంటూ క్యాప్షన్ ను రాసుకొచ్చింది.

అంతే కాకుండా ప్రశాంత్ సింగ్ తో కలిసి దిగిన ఫోటోను కూడా తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది.

రియా చక్రవర్తి చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నిజామాబాద్‌ జిల్లాకు బిజెపి, బిఅర్‌ఎస్‌ పార్టీలు చేసింది శూన్యం : ధర్మపురి సంజయ్