సూర్యాపేట జిల్లా: సూర్యాపేట మండల బీఆర్ఎస్ ఎంపీపీ బీరవోలు రవీందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ రామసాని శ్రీనివాస్ నాయుడుతో పాటు సుమారు 100 మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ రామిరెడ్డి దామోదర్ రెడ్డి సమక్షంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరినవారికి ఆయన కాంగ్రేస్ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కొప్పుల వేణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రోజుకో కివి పండు తింటే శరీరంలో ఎన్ని మార్పులు వస్తాయో తెలుసా?