సూర్యాపేట జిల్లాలో కత్తిపోట్ల కలకలం

సూర్యాపేట జిల్లాలో కత్తి పోట్ల కలకలం చెలరేగింది.పట్టణంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఓ వ్యక్తిపై కొందరు గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడికి పాల్పడ్డారు.

బాధిత వ్యక్తి తాళ్లగడ్డకు చెందిన సంతోష్ గా గుర్తించారు.సంతోష్ పని మీద కార్యాలయానికి వస్తుండగా ప్రత్యర్థులు కత్తితో దారుణంగా పొడిచారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.బాధితుడిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నాగచైతన్య తండేల్ ను సంక్రాంతి రేసులో నిలపడం వెనుక అసలు రీజన్ ఇదేనా?