గజినీ సీక్వెల్ సినిమా రాబోతోందా.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన సూర్య!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య( Suriya ) గతంలో నటించిన సూపర్ హిట్ సినిమాలలో గజినీ( Ghajini ) సినిమా ఒకటి.

2005వ సంవత్సరంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ సొంతం చేసుకుంది.

డైరెక్టర్ మురగదాస్( Murugadass ) దర్శకత్వంలో సూర్య ఆసిన్ నయనతార ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా తెలుగు తమిళ భాష చిత్రాలలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈ చిత్రాన్ని బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రీమేక్ చేశారు.

అమీర్ ఖాన్( Aamir Khan ) హీరోగా మురగదాస్ డైరెక్షన్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదలైన ఈ సినిమా అక్కడ కూడా సంచలనమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇక హిందీలో ఈ చిత్రాన్ని తెలుగు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మించి భారీ లాభాలను అందుకున్నారు.

"""/" / ఇక ఇటీవల కాలంలో సీక్వెల్ సినిమాల ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే కంగువ( Kanguva ) ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్న సూర్యకు ఇదే ప్రశ్న ఎదురయింది.

గతంలో కూడా డైరెక్టర్ మురగదాస్ పలు సందర్భాలలో గజినీ సీక్వల్( Ghajini Sequel ) వస్తుందంటూ తెలియజేశారు.

తాజాగా హీరో సూర్య మాట్లాడుతూ మరిన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. """/" / ప్రస్తుతం డైరెక్టర్ మురగదాస్ ఈ సినిమా స్క్రిప్ట్ పనులలో బిజీగా ఉన్నారు.

దాదాపు ఈ సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తి అయ్యాయని షూటింగ్ ఎప్పుడు మొదలుపెట్టిన తాను కూడా సిద్ధంగానే ఉన్నానని తెలియజేశారు.

ఇక ఈ సినిమాలో తాను అమీర్ ఖాన్ తో కలిసి సందడి చేయబోతున్నానంటూ కూడా ఈ సందర్భంగా సూర్య తెలియజేయడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.

సూర్య చేసిన ఈ కామెంట్స్ పై పలువురు నేటిజన్స్ స్పందిస్తూ ఈ సినిమా మల్టీ స్టారర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

త్రివిక్రమ్ సునీల్ 30 రూపాయల అనుభవం తెలుసా.. ఇన్ని కష్టాలు అనుభవించారా?