నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
TeluguStop.com
నోట్ల రద్దుపై భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెల్లడించింది.కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నోట్ల రద్దుకు వ్యతిరేకంగా 58 పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్లపై జస్టిస్ ఎస్ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ జరిపింది.
ఈ క్రమంలో నోట్ల రద్దు నిర్ణయాన్ని సుప్రీం సమర్థించింది.ఆర్బీఐ యాక్ట్ సెక్షన్ 26(2) ప్రకారం భారత సెంట్రల్ బ్యాంకుకు ఈ అధికారం ఉంటుందని తెలిపింది.
ఈ మేరకు 2016 నవంబర్ 8న నోట్లను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ సరైనదేనని న్యాయస్థానం స్పష్టం చేసింది.
కాగా 2016లో ప్రధాని మోదీ రూ.500, రూ.
1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు.. ప్రముఖ డైరెక్టర్ కామెంట్స్ వైరల్!